Site icon Newsminute24

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: మోదీ

గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ తెలిపారు.
కాగా తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు మోది తెలిపారు.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశార.. వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా.. ఫలించలేదు. ఈ నేపథ్యంలో సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

Exit mobile version