Telangana: గల్లాపెట్టె… నోటిమాట… ‘దివాలా అరిష్టం..!
INCTelangana: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ పరిభాష కూడా అభ్యంతరకరంగా ఉందనేది…
INCTelangana: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ పరిభాష కూడా అభ్యంతరకరంగా ఉందనేది పరిశీలకుల భావన! అవి రాజకీయ ఆరోపణలైనా, వ్యక్తిగత విమర్శలైనా, సంస్థాగత వివరణలైనా… ముఖ్యమంత్రి స్థాయికి తగిన రీతిలో సాగితేనే హుందాగా ఉంటుందనేది రాజకీయ పరిభాష (పొలిటికల్ లాంగ్వేజ్) తెలిసిన వారి అభిప్రాయం. తెలంగాణ ఉద్యోగుల నిరసనోద్యమ హెచ్చరికని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఖజానా`ఆర్థిక పరిస్థితిపై ఆయన వెల్లడిరచిన సమాచారం తెలుగునాట చర్చనీయాంశాలయ్యాయి….
MLCKAVITHA: ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీపై మరోసారి ధిక్కార స్వరం వినిపించింది.ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించింది. భారత దళాలకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో పోస్టులు మినహా ప్రత్యక్ష కార్యక్రమాలు చేపట్టలేదు. తాజాగా ఆమె ర్యాలీ ప్రకటనతో బిఆర్ఎస్ పార్టీని వీడి వేరు కుంపంటి పెడుతుందన్న వాదనలకు…
Telangana: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ============= బీఆర్ఎస్(భారాస )సిల్వర్ జూబ్లీ వేడుకలు ఊరించి ఉసూరుమనిపించినట్టు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం ఆ పార్టీ కార్యకర్తలకే నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. ప్రసంగం ఆద్యంతం పాత చింతకాయ పచ్చడిలా రొటీన్గా, జీర్ణించుకోలేని విధంగా సాగిందని బీఆర్ఎస్ శ్రేణులే చెప్పడాన్ని బట్టి, ఈ సభ ఎలా సాగిందో అర్థం…
Tamilnadu : ‘పరువు హత్య’ అంటాం కానీ, ప్రేమికుల అంతానికి కారణమయ్యేది ‘కులం’. కాబట్టి వారిది ‘కులోన్మాద హత్య’. ఈ దేశంలో పరువుకు కులం ఉంటుంది. అది అత్యంత దారుణాలకు పాల్పడుతుంది. ఘోరాలు చేయిస్తుంది. అసలైన ఘోరమేమిటంటే, కులం కోసం సొంత మనుషుల్ని చంపినవారికి సైతం మద్దతు పలికే వారిని కూడగడుతుంది. ఉగ్రవాదానికి సాయం అందించినవారూ ఉగ్రవాదులైతే, కులోన్మాదానికి మద్దతు పలికేవారు కూడా కులోన్మాదులే. అలాంటి కులోన్మాదులు 2003లో చేసిన ఓ దారుణం ఇది. తమిళనాడు రాష్ట్రం…
Operationsindoor: భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికి ప్రకటన రావాలి. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే(లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు సమాచారం. కానీ…
Castcensus: దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కులగణన డిమాండ్లు వినిపిస్తున్నా… హిందువులంతా ఒక్కటే అని చెప్తూ వచ్చిన బీజేపీ, ఎవరూ ఊహించని విధంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జనాభా లెక్కలతోనే కులగనణ చేపట్టాలని తీర్మానించింది. కులగణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతిపక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనుందా? అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా…
telangana: బిఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమైనట్లు తెలుస్తోంది.మేడే సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేసీఆర్ ఫోటో కనపడకపోవడం.. ఆయన స్థానంలో ప్రోఫెసర్ జయశంకర్ ఫోటో దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇటీవల బిఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎదురైన అవమానంతో తగ్గేదేలే అన్నట్లు రాజకీయ ప్రయాణం ఉండబోతోందని కవిత చెప్పకనే చెప్పిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వేరే పార్టీలో చేరతారా లేక తెలంగాణ జాగృతి పేరుతో ఒంటరి పోరాటం చేస్తారన్నది…
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిఆర్ఎస్ రజతోత్సవ సభ సాక్షిగా తన రాజకీయ వారసుడు కేటీఆర్ మాత్రమేనని కేసీఆర్ పరోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో కవిత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కాంలో జైలుకి వెళ్లి వచ్చిన నాటి నుంచి ఆమెను కేసీఆర్ కుటుంబం రాజకీయాలకు దూరంగా పెడుతు వస్తోంది. నాటి నుంచి జాగృతి పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ…
BiharElection: బీహార్ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి…
LoveDrama : ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మంచిదని కొందరి అభిప్రాయం. పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవడం ఉత్తమం అని మరికొందరి ఉద్దేశం. ప్రేమంటూ ఉంటే చాలు, పెళ్లికి ముందైనా, తర్వాతైనా హాయిగా జీవించొచ్చు అనేది అందరి అభిప్రాయం. వాదోపవాదాలు ఎలా ఉన్నా, ప్రపంచంలో ప్రేమ అనేది చాలామంది ఒప్పుకునే విలువైన సాధనం. చాలా ప్రేమకథలు పెళ్లితో పూర్తయితే, కొన్ని ప్రేమకథలు పెళ్లి తర్వాతే మొదలవుతుంటాయి. అలాంటి కథ ఒకటి ఇది. 2024లో పాకిస్థానీ దర్శకుడు బదర్ మెహమూద్ తెరకెక్కించిన…