Sangareddy: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొంతుకోసి హత్య చేసిన యువకుడు…!

సంగారెడ్డి: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని క ఓ యువకుడు ఘోరానికి ఒడిగట్టాడు. ఆమెను న గొంతుకోసి హత్య చేసిన అనంతరం తానూ ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన బొత్స శ్రీనివాస రావు, ఈశ్వరమ్మ దంపతులు సుదీర్ఘకాలంగా సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె రమ్య (23), చందానగర్‌లోని ప్రగతి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది….

Read More

Jukkal: జర్నలిస్టు దత్తురెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

మద్దెల చెర్వు, జూలై 8: పత్రికా వర్గాల్లో నిబద్ధతతో, విలువలతో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి అకాల మరణం జర్నలిస్టు సమాజాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దత్తురెడ్డి గారి స్వగ్రామమైన మద్దెల చెర్వులో ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి వెంకట్ రెడ్డి, దత్తురెడ్డి భార్య ప్రియాంకతోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. “దత్తురెడ్డి సేవలను మరువలేం. ఆయన కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ…

Read More

Hyderabad: టెలికమ్యూనికేషన్, ఐటి రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది: పటేల్ రమేష్ రెడ్డి

హైదరాబాద్: బేగంపేట్ వైట్ హౌస్‌లో నూతనంగా నిర్మించిన న్యూ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ని సోమవారం  తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “టెలికమ్యూనికేషన్, ఐటి, కార్పొరేట్ రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి ప్రాంగణాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. హైదరాబాద్‌ను ప్రపంచ కార్పొరేట్ మ్యాప్‌పై మరింత బలంగా నిలిపే దిశగా ఇవి మైలురాళ్లవిగా నిలుస్తాయి,” అని తెలిపారు. ఈ…

Read More

Nalgonda: Miryalaguda Deputy Tahsildar javeed Arrested by ACB

Hyderabad, July 7: In a significant crackdown on corruption, officials from the Telangana Anti-Corruption Bureau (ACB) have arrested Shaik Javeed, Deputy Tahsildar currently serving in the Civil Supplies department at Miryalguda, under the District Civil Supplies Officer (DCSO), Nalgonda District.The arrest was made in connection with a case registered on June 7, 2025, wherein Javeed…

Read More

Vikarabad: బీజేపీలో మాంసాహారులకు స్థానం లేకపోతే పార్టీ ఎలా బలపడుతుంది?: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్: “మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదని ఎవరైనా భావిస్తే, అలా బీజేపీ ఎలా బలపడుతుంది?” అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీకు దేశభక్తి ఉంటే, దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్‌లలో చేరండి. బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో ఉండే అర్హత మీకు ఉండదంటూ” తీవ్ర స్థాయిలో…

Read More

Kerala:Fresh Nipah Virus Scare in Kerala…

Thiruvananthapuram, July 7: Kerala has once again been rocked by the re-emergence of the deadly Nipah virus, with two confirmed fatalities reported in the state. Health Minister Veena George officially announced that two individuals who contracted the virus have succumbed to the infection. In response, the state health department has placed 383 people, who came…

Read More

Telangana:బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కవిత ఢిల్లీ పర్యటన?

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు రెండు…

Read More

Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం లోకేశ్ తో కేటీఆర్ భేటీ?

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. ఈ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతటితోనే ఆగకుండా, “నారా లోకేష్‌ను కేటీఆర్ ఎందుకుకలవాలనుకుంటున్నారు ?అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై,” ఉందన్నారు. అంతేకాదు, కేటీఆర్-లోకేష్ మధ్య ఒక్కసారి కాదు, పలు మార్లు రహస్య మంతనాలు జరిగాయి అని ఆరోపించారు సామా. ఈ…

Read More
Optimized by Optimole