Site icon Newsminute24

టిఆర్ఎస్ పై విరుచుకుపడిన బీజేపీ నేతలు!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ గేర్ మార్చింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకూ సాగుతున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాక వీలు చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. తాజా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.హుజూరాబాద్ ఉపఎన్నిక ట్రైలర్‌ మాత్రమేనని… త్వరలో సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని ఆయన అన్నారు. మోదీ అశీర్వాదంతో తెలంగాణలో రామరాజ్యం రాబోతోందని స్పష్టం చేశారు. కేసీఆర్ అహంకారంతో పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసిఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోసం తన తల నరుక్కోవడానికి సిద్ధమని ఆయన అన్నారు.తాను పేదల కోసం కొట్లాడుతున్నానని సంజయ్​ చెప్పారు. కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని స్పష్టం చేశారు. కేసీఆర్​ తనను ఎన్ని తిట్టిన భయపడనన్నారు. తాము త్యాగాలను వెనకాడనన్నారు.

Exit mobile version