Site icon Newsminute24

IncTelangana: పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసహనం..!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొంగులేటి ప్రకటన అనవసరమైన గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన అంశాలపై ముందుగా పార్టీతో చర్చించి, క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటనలు చేయాలని సూచించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరిని స్పందించకుండదని.. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని మహేష్ గౌడ్ హెచ్చరించారు.

Exit mobile version