Newsminute24

Yadadri: నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి: వేముల బిక్షం

Atmakur: తెలంగాణ నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకం పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అని క్షౌర వృత్తి దారుల యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రిజిడెంట్ వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అత్మకూర్ (ఎమ్ )మండలంలో శుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద నాయి బ్రాహ్మణులంత కలిసి జూన్ 17న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.జీవో నెంబర్ రెండు ప్రకారం నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు రూ.40. వేల పైన క్షౌర వృత్తి దారుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు అని చెప్పారు. ఈ పథకానికి సంవత్సర కాలం నుండి ప్రభుత్వం సకాలంలో పెండింగ్ బిల్లులు సబ్సిడీ విద్యుత్ శాఖకు చెల్లించకపోవడం వలన అట్టి పెండింగ్ బిల్లులు పెరిగిపోవడంతో విద్యుత్ అధికారులు వృత్తిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.బిల్లు కట్టాలని లేనియెడల కనెక్షన్ తొలగిస్తామని బెదిరిస్తున్నారు కావున వెంటనే సంవత్సర కాలం నుండి పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అదేవిధంగా కరెంటు వల్ల వేధింపులు ఆపాలని మోడ్రన్ సెలూన్లు ఏర్పాటు చేయాలని వృత్తిదారులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి నాయి బ్రాహ్మణునికి వృద్ధాప్య పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాజీవ్ యువ పథకాలను నాయి బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేముల బిక్షం డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు రాచమల్ల సత్తయ్య,రాచమల్ల కృష్ణ,బండి నరేష్,ఆత్మకూర్ టౌన్ అధ్యక్షుడు రాచమల్ల బలరాం ,రాచమల్ల జగన్,రాచమల్ల నర్సింహ,రాచమల్ల రవి, ఎపురి బుగ్గ రాములు,తదితరులు పాల్గొన్నారు..

Exit mobile version