Site icon Newsminute24

అక్టోబర్ 1 వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర..

Janasenavarahivijayayatra4: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. పూర్తి షెడ్యూల్ ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

 

 

 

Exit mobile version