Site icon Newsminute24

Telangana: సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి: హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిబంధనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 30లోపు సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

గత కొంతకాలంగా ఎన్నికలు జరిగకపోవడం వల్ల గ్రామీణ పాలనా వ్యవస్థల్లో ప్రజా ప్రతినిధులు లేకపోవడం, అధికార నియంత్రణ లేకుండా ఉండటం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఈ తీర్పుతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది.ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తక్కువ వ్యవధిలోనే ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. 

Exit mobile version