Newsminute24

Hyderabad: దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్: ఈనాడు సీనియర్ జర్నలిస్టు, వరంగల్ జిల్లా  స్టాఫ్ రిపోర్టర్ దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్తు గల దత్తు రెడ్డి అకాలమరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం మీడియా రంగానికి.. దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు.

దత్తు రెడ్డి కుటుంబ సభ్యులకు టీపిసిసి చీఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం ప్రసాదించాలని కోరారు.దత్తు రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన మృతి పట్ల తాను తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Exit mobile version