Site icon Newsminute24

విశాఖ రాజ‌ధానిపై వైసీపీ కి స‌వాల్ విసిరిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌

గుంటూరు :  విశాఖ రాజ‌ధాని అంశంపై విరుచుకుప‌డ్డారు జ‌న‌సేన‌ నాదెండ్ల మనోహర్ . వైసీపీ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే..రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లి .. ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ స‌వాల్ విసిరారు. రాజధానుల విషయంలో.. రాష్ట్ర‌ యువ తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు. రాజధాని పై ప్ర‌భుత్వం రోజుకో ప్రకటన చేస్తుంటే.. పెట్టుబడులు పెట్టటానికి ఎవ‌రొస్తార‌ని ప్ర‌శ్నించారు. రాజకియ్య ల‌బ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి.. ఇంకా ఎన్నిరోజులు బూటకపు ప్రకటనలు చేస్తారని మండిప‌డ్డారు. మొదట్నుంచి అమరావతి రాజధాని అని జనసేన డిమాండ్ చేస్తుంద‌ని గుర్తుచేశారు.పాలన చేతకాని దద్దమ్మలే రాజధానుల గురించి మాట్లాడుతున్నారని మనోహ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Exit mobile version