Site icon Newsminute24

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు..?

హైదరాబాద్: ప్రముఖ టీ న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. రామ్ నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఆమె శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని సమగ్రంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఓ మహిళా జర్నలిస్టు—స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానెల్ లో లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో స్వేచ్ఛ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది.పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటనతో మీడియా రంగంలోని మహిళల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. స్వేచ్ఛ మృతి వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సహచరులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version