సూర్యాపేటలో మైనింగ్ అక్రమాలు..పట్టించుకోవడంలేదని వాపోతున్న ప్రజలు..
సూర్యాపేట జిల్లాల్లో మైనింగ్ అక్రమాలు యథేచ్చగా సాగుతున్నాయి. 20 ఎకరాలకు మైనింగ్ పర్మిషన్ తీసుకున్న ఓ సంస్థ 40 ఎకరాలకు తవ్వకాలు జరుపుతున్న పట్టించుకోని పరిస్థితి ఉందని..అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నామని స్ధానికులు వాపోతున్నారు. చిత్రం ఏంటంటే పర్మిషన్ లేని భూములకు కూడా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతుబంధు అందుతుండడం అధికారుల నిర్లక్ష్యంగా అద్దం పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం పరిధిలోగల మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీ వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని…