Newsminute24

Telangana: “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణకు రంగం సిద్ధం..!!

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర ప్రజాపాలనలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల విశేషాలను.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తలెత్తిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంకలనం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తక రూపంలో వెలువడుతోంది.

 ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. మొత్తం 260 పేజీలతో రూపొందిన ఈ పుస్తకంలో మహేశ్ కుమార్ గౌడ్ గత కొంతకాలంగా వివిధ పత్రికలలో ప్రచురించిన 36 వ్యాసాలను సంకలనం చేశారు.

‘‘ఇందిరమ్మ రాజ్యం’’ లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ వ్యాసాలు ఉపయోగపడతాయనే భావనలో టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ నినాదంతో వికాసం దిశగా తీసుకెళ్తున్న ప్రగతిని ఈ వ్యాసాలు ప్రతిబింబిస్తున్నాయి.

Exit mobile version