సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ” రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ ” మంజూరు చేసిందని గుర్తు చేశారు. బోర్డు ద్వారా 30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి పార్లమెంట్ ఆమోదించిందని.. 1986 నుండి 2020 వరకు 35 ఏళ్లలో కూడా రానటువంటి బడ్జెట్ ను ఈ మూడేళ్ల కాలానికే తెచ్చుకున్నామన్నారు. ఇదివరకే 9 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని అరవింద్ పేర్కొన్నారు. ఈ అవకాశం వలన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంత పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందన్నారు. పసుపు, మిర్చి పంటల రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం మరింతగా కృషి చేస్తుందని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.