పరుగుల రేడు గుండె ఆగింది!
భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాసవిడిచారు.ఆక్సిజన్ స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం వల్ల మిల్కాను జూన్ 3న చంఢీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల ముందే మిల్కా సతీమణి నిర్మల్ కౌర్ కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కాగా మిల్కా మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. “ఆయన ఎంతో పోరాడారు. కానీ దేవుడు తన పని తాను చేశాడు. నిజమైన ప్రేమ వల్లే మా అమ్మ నిర్మల..ఇప్పుడు నాన్న.. 5 రోజుల వ్యవధిలో ఈ లోకాన్ని విడిచివెళ్లారు.” అని వెల్లడించారు.వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ మిల్కాను మృతి పట్ల ఆయన కు వైద్యం అందించిన ఆస్పత్రి విచారం వ్యక్తం చేసింది.
1932 నవంబర్ 20న పంజాబ్ (పాకిస్థాన్) గోవింద్పురలోని సిక్ రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో మిల్కాసింగ్ జన్మించారు. భారతదేశ క్రీడా ఆణిముత్యంగా కీర్తి గడించారు. పరుగు పోటీల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారు. ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న సమయంలో స్ప్రింటర్గా కెరీర్ మలుచుకున్నాడు. ఆసియన్, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున స్వర్ణ పతకాలు గెలిచిన ఏకైక అథ్లెట్గా రికార్డు సృష్టించాడు. 1956లో మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. అయితే ఆ విశ్వక్రీడల్లో పతకం గెలవలేదు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో బ్రిటీష్ ప్రభుత్వం, కామన్వెల్త్ పోటీల్లో అరుదైన ఘనత సాధించారు. 46.6 సెకన్లలో 440 యార్డ్స్ పరుగెత్తి స్వర్ణం గెలిచిన మిల్కా.. భారత్ తరపున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. మిల్కా సింగ్ సేవలను కొనియాడుతూ 1959లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రధానం చేసింది. ఆర్మీకి చెందిన మిల్కా సింగ్ గౌరవ కెప్టెన్ హోదాలో రిటైర్ అయ్యారు. ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించిన ‘బాగ్ మిల్కా బాగ్’ చిత్రం అనేక రికార్డులను క్రియేట్ చేసింది.
ఇక లెజండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
“మిల్కా మరణంతో నా హృదయం దుఃఖంతో నిండిపోయింది. జీవితంలో మిల్కా ఎదుర్కొన్న కష్టాలు, ఆయన బలమైన వ్యక్తిత్వం.. భారత్లో అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.” అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ సంతాపం తెలుపతూ.. దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది. కోట్లాది మంది హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
హోంమంత్రి అమిత్ షా మిల్కా మరణం పట్ల విచారణ వ్యక్తం చేస్తూ.. ప్రపంచ అథ్లెటిక్స్లో మిల్కా సింగ్.. చెరగని ముద్ర వేశారు. దేశంలోనే గొప్ప క్రీడాకారునిగా ఆయనను ఎల్లపుడూ దేశం స్మరిస్తుంది.” అని ట్వీట్ చేశారు.తారను కోల్పోయాం..
జననం: