కాపుల అంబేడ్కర్‌ కోట్ల కాదా? వేమూరి రాధాకృష్ణ గారేనా?

Nancharaiah merugumala: (senior journalist) ============= అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్ర (బీజేపీ) సర్కారు ఐదేళ్ల క్రితం కల్పించిన కోటాలో కాపులకు 2019లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన చట్టంపై కేంద్రం నిన్న పార్లమెంటులో వివరణ ఇచ్చింది. విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగాల్లో కోటా కల్పించే కులాల (ఎస్యీబీసీ) జాబితా రూపొందించుకునే అధికారం రాష్ట్రాలదేనని కూడా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్‌ తన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు….

Read More

పన్ను వసూలు పేరుతో అధికారులు బెదిరిస్తున్నారు: మనోహర్

ఏపీ లో ఖాళీ స్థలాల పేరు చెప్పి సామాన్యులను  పన్ను వసూలు పేరుతో మున్సిపాలిటీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. ఖాళీ స్థలాల్లో బోర్డులుపెట్టి హెచ్చరించడాన్ని కచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత కబ్జాలుగా భావిస్తున్నామన్నారు.ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను కాపాడే ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారిగా, కబ్జాకోరుగా మారడానికి వైసీపీ నాయకత్వమే కారణమని మనోహర్ మండిపడ్డారు. కాగా  సీఎం జగన్  ఆలోచనకు అనుగుణంగానే మున్సిపల్  అధికారులు నడుచుకొంటున్నారేమోని?..ఇంటి…

Read More

కేసిఆర్ సీఎం పదవికి రాజీనామ చేయాలి: తరుణ్ చుగ్

ఎట్టకేలకు దిల్లీ లిక్కర్ స్కాంలో గుట్టు రట్టయిందన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్  కుమార్తె కవిత ప్రమేయాన్ని నిర్ధారించడంతో బిజెపి ఆరోపణలు నిజమని రుజువైందన్నారు. సౌత్‌ గ్రూప్‌లో భాగంగా ఆప్ దళారుకు..కవితలు రూ.100 కోట్లకు పైగా లంచం ఎలా అందజేసింది.. ఈ డీల్ ద్వారా ఈ గ్రూప్‌కి రూ.192 కోట్లకు పైగా…

Read More

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read More

సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

       భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది.  దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్‌సభ ఎన్నికలతో…

Read More

నల్గొండ ‘కారు’ స్టీరింగ్ ఎవరికో..?

నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టికెట్‌ భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు తప్పదని తేలడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మరోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ కన్ఫార్మ్‌ చేసిన ఆశావాహులు మాత్రం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వామపక్షాల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో జిల్లా టీఆర్ఎస్ టికెట్ ఎవరికీ దక్కుతుందాన్న చర్చ పార్టీ వర్గాల్లో…

Read More

వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్

సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్, బ్రోకర్.. ఎప్పుడో చెప్పా : రాజగోపాల్ రెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, బ్రోకర్ అని తాను ఎప్పుడో చెప్పానని.. అతనితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం బెటర్ అంటూ విమర్శించారు.ప్రజా సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదని.. తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని.. తాను ఆరోజే చెప్పానని స్పష్టం చేశారు.నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని రాజగోపాల్…

Read More

అన్నదాత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: నాదెండ్ల మనోహర్

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.  వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని.. వారిలో మానవత్వం లేదని మనోహర్ మండి పడ్డారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి…

Read More

మాచర్ల ఘటనను ఖండిస్తున్నా : నాదెండ్ల మనోహర్

మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని…

Read More
Optimized by Optimole