ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి జ్ఞాపకలను అందజేశారు. పట్టణంలోని 32 వ వార్డులో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు చీరాల పంపిణి చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం..Vc KCGF Nalgonda సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కోటగిరి రామకృష్ణ తెలిపారు.
పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలువురు మహిళలకు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని..మహిళ సాధికారత దిశగా ముందుకు సాగాలని హితువు పలికారు.
పట్టణంలోని LIC బ్రాంచ్ _2 లో మహిళా సిబ్బందికి ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
సూర్యాపేటలో మంత్రి జగదీష్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాలకు చెందిన మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సాహితీ వేత్త నల్లాన్ చక్రవర్తుల రోజాదేవికి సన్మానం అనంతరం జ్ఞాపిక అందజేశారు.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం.