ఓపెన్ కేటగిరీ రద్దుచేసి, దాని స్థానంలో 50 శాతం EWS కోటా పెడితే మేలేమో!

————————– ———- ———-//
పది శాతం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 3-2 మెజారిటీ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియాలో రిజర్వేషన్ల వాటాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ (OC) లేదా జనరల్ కేటగిరీని రద్దుచేయాలి. ఈ ఓపీ లేదా ఓసీ కేటగిరీని రద్దు చేసి కూర్చోకూడదు.
EWS కోటాను 10 శాతం నుంచి 50 శాతానికి పెంచేసి రద్దయిన జనరల్ లేదా ఓపెన్ కేటగిరీ స్థానంలో పెట్టాలి. అప్పుడు అగ్రవర్ణాలు లేదా అగ్రకులాలవారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న-రిజర్వేషన్లలో ఆర్ధిక ప్రాతిపదిక -అమల్లోకి వచ్చినట్టవుతుంది. మిగిలిన 50 శాతంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండేలా జాగ్రత్త పడితే పవిత్ర భారతంలో ‘సామాజిక న్యాయం’ పరిఢవిల్లుతుంది. దేశంలో కులం కుంగి, కృశించి, నశించిపోతుంది. బాపూ, బాబాసాహబ్ కల నిజమవుతుంది.

Related Articles

Latest Articles

Optimized by Optimole