రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది..?
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత పీఠంపై.. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను కూర్చోబెట్టాలని అధికార ఎన్డీఏ భావిస్తుండగా.. విపక్ష ఇంద్రధనస్సు కూటమి తమ అభ్యర్థిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపి అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇరు పక్షాలు ప్రచార పర్వానికి తెరలేపారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ వ్యూహాత్మంగా వ్యవహరించింది. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అభ్యర్థిగా…