కోవిడ్ మరణాలు సంఖ్య దాదాపు ఎనిమిది నెలల తరువాత 140% కన్నా తక్కువగా పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ విషయమై నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ ‘కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి వచ్చిన నివేదికలు చాలా తక్కువని.. ఇప్పటివరకు 4,54,049 మందికి టీకాలు వేశారని.. ఏడు నెలల తరువాత కేసుల సంఖ్య 2 లక్షలకు తగ్గిందని అన్నారు.
కోవిడ్ టీకా విషయంలో మొదటి మూడు రోజులు రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారిలో 0.18% అస్వస్థతకు గురయ్యారని.. రోగనిరోధకత పెరిగిన తరవాత అసంఖ్య 0.002% తగ్గిందని అన్నారు. ప్రస్తుత డేటా ఆధారంగా కోవిడ్ టీకాలు సురక్షితమైనవని అందుకు భరోసా ఇస్తున్నట్లు పాల్ పేర్కొన్నారు.