టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూపై బీజేపీ ఫైర్.. యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్..!!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే తెలిసే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారానికి ఢిల్లీ కేంద్రంగా కథ , స్క్రీన్ ప్లే కేసీఆర్ రచించారని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈవిచిత్ర డ్రామా వెనక నిజాలు ఎంటో తెలవాలంటే ప్రగతిభవన్ మూడు రోజుల సీసీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు. ఈవిషయంలో యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణం చేద్దాం రా అంటూ కేసీఆర్ కు బీజేపీ నేతలు సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్రం రాజకీయమంతా మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా నడుస్తున్న తరుణంలో..టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూ రాజకీయ వర్గాల్లొ చర్చకు దారితీసింది.తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతుందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రచారానికి కమలం నేతలు ఊహించని రీతిలో విరుచుకుపడ్దారు.ముఖ్యంగా స్టేట్ చీఫ్ బండిసంజయ్.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంపై యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణం చేద్దాం రా అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.విచిత్ర డ్రామా ఆడి టీఆర్ఎస్ అడ్డంగా ప్రజలకు దొరికిపోయిందని ఎద్దేవ చేశారు. కేసీఆర్ ను ప్రజలను నమ్మేస్థితిలో లేరన్నారు.టీఆర్ఎస్ డ్రామాతో మునుగోడు బీజేపీ విజయం ఖాయమైపోయిందని సంజయ్ కుండబద్ధలు కొట్టారు.

అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈఇష్యూపై ఘాటుగా స్పందించారు.ఎమ్మెల్యే కొనుగోళ్ల డ్రామాకు కథ..స్క్రీన్ ప్లే ..రచన.. దర్శకత్వం అంతా టీఆర్ఎస్..టీఆర్ఎస్ ఆడుతున్న నాటకమంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మునుగోడులో ఓడతామని తెలిసే ఈడ్రామాకు తెరలేపారన్నారు.ఫామ్ హౌస్ నుంచి వచ్చిన ముగ్గురికి..బీజేపీకి ఎటువంటి సంబంధం తేల్చిచెప్పారు.ఈఘటనపై సుప్రీంకోర్డు జడ్జీతో విచారణకు సిద్ధమన్నారు.కేసీఆర్ చెప్పే కథలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా తెరతీసిందని మండిపడ్దారు.

ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం ఈఘటనపై తీవ్రంగా స్పందించారు.కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో దొరికిన వారెవరన్నది త్వరలో తేలతుందని..అనవసరంగా బీజేపీ అభండాలు వేయొద్దని హెచ్చరించారు.మునుగోడు ఉప ఎన్నిక కోసం ఎన్ని ఎత్తుగడలు వేసిన..ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని అరుణ స్పష్టం చేశారు.

చివరగా  ఇటువంటి చిల్లర డ్రామాకు టీఆర్ఎస్ తెరలేపడం వెనక దాగున్న మర్మమెంటో ప్రజలకు తెలిసిపోయిందని.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ నేతలు చెప్పకనే చెప్పారు.

Optimized by Optimole