ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం బడ్జెట్ గురించి ఆమె వెల్లడిస్తూ.. ఆస్ట్రేలియా టీమిండియా విజయ మాదిరి, కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గట్టేకుతుందని ఆమె అన్నారు.
బడ్జెట్ హైలైట్స్..
- భీమారంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐల కి అనుమతి.
- రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది.
- వ్యక్తిగత వాహనాల 10 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు పదిహేనేళ్ల పరిమితి.
- విద్యుత్ రంగానికి 3.5 లక్షల కోట్లు.
- ఈ ఏడాది రైల్వే రంగానికి లక్షా 10 వేల కోట్లు.
- 2020-21 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం లక్షా 75 వేల కోట్లు.
- పిపిఏ పద్ధతి ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల ఏడు కొత్త ప్రాజెక్టులు.
- బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు.
- మెగా టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్ పార్కులో ఏర్పాటు..వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్టైల్ పార్కులు
- హెల్త్ కేర్ కు రెండు లక్షల కోట్లు.
- మెట్రో లైట్ మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టు..బెంగళూరు మెట్రో విస్తరణకు 14700 కోట్లు.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ.
- వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేసేందుకు పథకాలు.
- ఉజ్వల స్కీం కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు.
- బ్యాంకింగ్ లో భారీ సంస్కరణలు.. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం.
- స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కోసం 141678 కోట్లు.