కాపుల అంబేడ్కర్‌ కోట్ల కాదా? వేమూరి రాధాకృష్ణ గారేనా?

Nancharaiah merugumala: (senior journalist) ============= అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్ర (బీజేపీ) సర్కారు ఐదేళ్ల క్రితం కల్పించిన కోటాలో కాపులకు 2019లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన చట్టంపై కేంద్రం నిన్న పార్లమెంటులో వివరణ ఇచ్చింది. విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగాల్లో కోటా కల్పించే కులాల (ఎస్యీబీసీ) జాబితా రూపొందించుకునే అధికారం రాష్ట్రాలదేనని కూడా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్‌ తన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు….

Read Full News

పన్ను వసూలు పేరుతో అధికారులు బెదిరిస్తున్నారు: మనోహర్

ఏపీ లో ఖాళీ స్థలాల పేరు చెప్పి సామాన్యులను  పన్ను వసూలు పేరుతో మున్సిపాలిటీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. ఖాళీ స్థలాల్లో బోర్డులుపెట్టి హెచ్చరించడాన్ని కచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత కబ్జాలుగా భావిస్తున్నామన్నారు.ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను కాపాడే ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారిగా, కబ్జాకోరుగా మారడానికి వైసీపీ నాయకత్వమే కారణమని మనోహర్ మండిపడ్డారు. కాగా  సీఎం జగన్  ఆలోచనకు అనుగుణంగానే మున్సిపల్  అధికారులు నడుచుకొంటున్నారేమోని?..ఇంటి…

Read Full News

సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

       భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది.  దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్‌సభ ఎన్నికలతో…

Read Full News

వైసీపీ ,జనసేన ట్విట్టర్‌ వార్‌..

ఏపీలో వైసీపీ ,జనసేన మధ్య ట్విట్టర్‌ వార్‌ నడుస్తోంది. జనసేన అధినేత పవణ్‌ కళ్యాణ్‌..కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ్న సభలో వైసీపీ గాడిదలు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కౌంటర్‌ గా వైసీపీ ఎమ్యెల్యే అంబటి..తాము కాదు గాడిదలమని..బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి అంటూ సెటైర్లు వేశారు.దీంతో ఇరుపార్టీల మధ్య సోషల్‌ వార్‌ మొదలైంది.ఇటు జనసేన నేతలు..అటు వైసీపీ నేతలు తగ్గేదెలే తరహాలో ట్విట్ల దండకంతో ట్విట్టర్‌ ను షేక్‌ చేస్తున్నారు. ఇక జనసేన…

Read Full News

వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్

సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…

Read Full News

అన్నదాత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: నాదెండ్ల మనోహర్

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.  వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని.. వారిలో మానవత్వం లేదని మనోహర్ మండి పడ్డారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి…

Read Full News

మాచర్ల ఘటనను ఖండిస్తున్నా : నాదెండ్ల మనోహర్

మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని…

Read Full News

మాచర్ల లో హై అలెర్ట్.. బ్రహ్మారెడ్డి గుంటూరు తరలింపు..!!

పల్నాడు: పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది.అధికార వైసీపీ , ప్రతిపక్ష టిడిపి పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ఇదే ఖర్మ ప్రోగ్రాం చేపట్టిన తరుణంలో.. ఇందుకు ధీటుగా వైసిపి  శ్రేణులు జైపీఆర్కే నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ.. ఒకరిపై మరొకరు రాళ్ళు, కర్రలతో  దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లర్లను అదుపు చేసి.. 144 సెక్షన్ అమలు చేశారు.  …

Read Full News

జగన్మోండిపై జనసేనాని బ్రహ్మస్త్రాలు..

  ఒక్క ఫొటో వేల మాటలతో సమానం అయితే, ఒక్క కార్టూన్‌ లక్షలమంది భావోద్వేగాలను చూపించే సాధనం. అక్షరం చిత్రంతో కలిసినప్పుడు అది బతుకు చిత్రానికి ప్రతీకే అవుతుంది.  నలిగిపోతున్న ఆంధ్ర ప్రజల బతుకు చిత్రాన్ని,  విరిగిపోయిన ఏపీ అభివృద్ధి రథాన్ని, పెరిగిపోతున్న వైసీపీ నియంతృత్వ పోకడను అలాంటి కార్టూన్‌ అస్త్రంతో ఎదుర్కొంటోంది జనసేన. గత ఆరేడు నెలలుగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తో పాటు, జనసేన అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వంపై సంధిస్తున్న కార్టూన్లు ఏపీ ప్రజల మనోగతాన్ని బయటపెడుతూ, వారి…

Read Full News

గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..

 Vijayawada: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. పీసీసీగా నియామకం తర్వాత తొలిసారి  కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులతో  కలిసి రుద్రరాజు బార్ అసోసియేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు.. రుద్రరాజు కి బెజవాడ బార్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వ కార్డు ని అందజేశారు. మరోవైపు గిడుగు రుద్రరాజును గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ పార్టీ…

Read Full News
Optimized by Optimole