‘పవన్ ‘అభిమన్యుడు కాదు అర్జునుడు: ఎంపీ రఘురామ

సమాజ హితం కోసం బాబు, పవన్ కలువాల్సిందేనన్నారు ఎంపీ  రఘురామ కృష్ణంరాజు.ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడమే  తక్షణ కర్తవ్యమన్నారు. వ్యక్తిగత మేలు కోసం కాకుండా.. ప్రజల కోసం ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.పసుపు, ఎరుపు రంగు కలిస్తే కాషాయమేనని తేల్చిచెప్పారు.  గతంలో జగన్ ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని రఘురామ గుర్తు చేశారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడం…

Read Full News

అక్కసుతోనే ప్రధాని మోదీని బద్నాం చేసే కుట్ర: బండి సంజయ్

దారిమళ్లించిన పంచాయతీ సొమ్మును BRS ప్రభుత్వం వడ్డీతోసహా చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఏపీ క్యాడర్ ను అడ్డంపెట్టుకుని తెలంగాణ సొమ్మును కేసిఆర్ దోచుకుతింటున్నాడని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుపుతుంటే.. అక్కసుతోనే ప్రధాని మోడీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.సీఎం చేతగానితనంవల్లే అప్పలు కుప్పగా రాష్ట్రం మారిందని వాపోయారు.ఆంధ్రోళ్లను రాక్షసులుగా..పెండ బిర్యానీగాళ్లుగా కించపర్చిన కేసీఆర్ ఇప్పుడే ఏం సమాధానం చెబుతారని? సంజయ్ ప్రశ్నించారు. కాగా నాగర్ కర్నూలు…

Read Full News

వైసీపీ పతనాన్ని కళ్లారా చూస్తాం: నాగబాబు

యువత రాజకీయాల్లోకి రాకపోతే.. అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆరోపించారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని..అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రణస్థలం వివేకానంద వికాస సభలో ఆయన మాట్లాడుతూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత ఇటీవల…

Read Full News

యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది: మనోహర్

యువత పోరాటంతోనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.శ్రీకాకుళం రణస్థలం యువశక్తి సభలో భాగంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.తెలంగాణతో పోలిస్తే నిరుద్యోగ రేటు ఏపీలో డబుల్ ఉందన్నారు. కావాలనే ఉత్తరాంధ్రా ప్రాంతంలో యువ నాయకత్వాన్ని తొక్కేశారని మండిపడ్డారు. వైసీపీ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వైసీపీ నాయకులు కొండల్ని మింగేస్తూ… కోట్లు కొల్లగొడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో జనసేన…

Read Full News

జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం..

జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం చేశామన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . సభా వేదిక నుంచి జనసేన భవిష్యత్తు కార్యాచరణను  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారని తెలిపారు.  రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించబోయే యువశక్తి సభ వేదిక వద్ద.. వైసీపీ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎంత మభ్యపెడుతుందో చెప్పడానికి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలను పూర్తిగా అయోమయంలోకి నెట్టి…

Read Full News

ఉత్తరాంధ్ర సమస్యలపై సీఎం జగన్‌ కి మాజీ ఎంపీ కొణతాల లేఖ ..

ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ.. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.‘‘నీళ్లు`నిధులు`నియామకాలు’ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలు..వివక్షత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఉత్తరాంధ్ర నుండి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది వలసలు పోతున్నారని.. ఒక్క హైదరాబాదులోనే 15 లక్షల మంది ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు వాచ్‌మెన్‌లుగా, చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నట్లు మీడియాలో అనేక కథనాలు వచ్చిన…

Read Full News

పేరుతో కాదు..‘ఫేమ్‌’తోనే పని !

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….

Read Full News

వైసీపీ నాయకుల చవకబారు మాటలు మానుకోవాలి: నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ మంత్రులు ఉలిక్కిపడడం చూసి జాలేస్తుందని ఎద్దేవ చేశారు. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కుటుంబ సభ్యులను.. అలాగే  గ్రంధి సన్యాసి రాజుని… రాజాంలోని వారి నివాసంలో  మనోహర్ ఆత్మీయంగా కలిశారు. అనంతరం ఆయన మీడియతో  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు….

Read Full News

గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా?

గవర సోదరుడు బుద్ధా వెంకన్న..గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా? ———————————————– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో- రెడ్డి, కమ్మ, కాపు ఆధిపత్య, ప్రేరేపిత రాజకీయాలపై పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న రాజుగోరు పెన్మత్స రాంగోపాల్ వర్మ నోటికొచ్చినట్టు కామెంట్ చేయగూడదంటే ఎలా? గోదారి జిల్లాల రాజులు చేపలు, రొయ్యల పెంపకంలో కూడా రాణించినంత మాత్రాన వారిని అగ్నికుల క్షత్రియులను (బెస్త/మత్స్యకారులు) బెదిరించే రీతిలో బెజవాడ బుద్ధా వెంకన్న మాట్లాడడం న్యాయమా? ఉత్తరాంధ్ర నుంచి వలస…

Read Full News

ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్‌ ….

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్‌) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …?…

Read Full News
Optimized by Optimole