Hyderabad: మ‌హోద్య‌మంలా వ‌న‌మ‌హోత్స‌వం: కొండా సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌ద‌లిచిన వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు మ‌హోద్య‌మంలా తీసుకొని ముందుకు వెళ్ళాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ చెప్పారు. వృక్షో ర‌క్షిత ర‌క్షితః నినాదాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె పున‌రుద్ఘాటించారు. వన మహోత్సవం-2025 పోస్టరు బుధ‌వారం జూబ్లీహిల్స్ లోని త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. పోస్ట‌రు ఆవిష్క‌రణ‌లో తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షిణాధికారిణి (PCCF Hoff) డాక్ట‌ర్…

Read More

Hyderabad: “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణ:మంత్రి శ్రీధర్ బాబు

Hyderabad: “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు,…

Read More

Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…

Read More

Telangana: జాగృతి కమిటీలతో కవిత జోరు..!

తెలంగాణా: జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభతో  తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె..సభకి సంబంధించి తండ్రి కేసిఆర్ కి లేఖ రాశారు. ఆ లేఖ లీక్ కావడంతో ఇండైరెక్టుగా కేటీఆర్, సంతోష్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. తదనంతర పరిణామాలతో ఆమె పార్టీ మార్పుపై అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ… ప్రజల్లో తీవ్ర చర్చ రేకెత్తింది. కవిత సొంతగా పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందంటూ ఊహాగానాలు…

Read More

IncTelangana:రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం: టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

షాద్ నగర్: రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దేశ విభజన రాజకీయాలను, విచ్ఛిన్న శక్తులను ఎదిరించేందుకు “జై బాపు, జై భీమ్,జై సంవిధాన్” కార్యక్రమాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్ధృతంగా చేపడతామని హెచ్చరించారు.మంగళవారం షాద్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే వీర్ల శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో…

Read More

TELANGANA: జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం..!

Kavitha: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి…

Read More

telangana: తేలని తెలంగాణ బీజేపీ గమనం..!!

BJPTELANGANA: తెలంగాణలో బీజేపీది సంక్లిష్ట పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నట్టే కనిపిస్తుంది, కానీ, ఏదీ తేల్చుకోలేని సందిగ్దస్థితి నుంచి పార్టీ నాయకత్వం బయటపడట్లేదు. కొత్త రాష్ట్రాధ్యక్షుడ్ని ఖరారు చేయలేని అశక్తత! అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలంగా, లోక్సభ ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు సాధించిన బీజేపీ పరిస్థితి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమిటి అంటే, ‘ఇదీ’ అని సమాధానం చెప్పలేని అయోమయం. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందమనే రాజకీయ విమర్శల నుంచి బయటపడే గుంజాటన…

Read More

Telangana: గల్లాపెట్టె… నోటిమాట… ‘దివాలా అరిష్టం..!

INCTelangana: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ పరిభాష కూడా అభ్యంతరకరంగా ఉందనేది పరిశీలకుల భావన! అవి రాజకీయ ఆరోపణలైనా, వ్యక్తిగత విమర్శలైనా, సంస్థాగత వివరణలైనా… ముఖ్యమంత్రి స్థాయికి తగిన రీతిలో సాగితేనే హుందాగా ఉంటుందనేది రాజకీయ పరిభాష (పొలిటికల్ లాంగ్వేజ్) తెలిసిన వారి అభిప్రాయం. తెలంగాణ ఉద్యోగుల నిరసనోద్యమ హెచ్చరికని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఖజానా`ఆర్థిక పరిస్థితిపై ఆయన వెల్లడిరచిన సమాచారం తెలుగునాట చర్చనీయాంశాలయ్యాయి….

Read More

Kavitha: బిఆర్ఎస్ పై క‌విత మ‌రోసారి ధిక్కార స్వ‌రం..!

MLCKAVITHA: ఎమ్మెల్సీ క‌విత బిఆర్ఎస్ పార్టీపై మ‌రోసారి ధిక్కార స్వ‌రం వినిపించింది.ఉగ్ర‌వాదాన్ని అంతం చేయాల‌నే ల‌క్ష్యంతో భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ కు మ‌ద్ద‌తుగా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈనెల 9 వ తేదీన భారీ ర్యాలీ చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. భార‌త ద‌ళాల‌కు మ‌ద్ద‌తుగా బిఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టులు మిన‌హా ప్ర‌త్య‌క్ష కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. తాజాగా ఆమె ర్యాలీ ప్ర‌క‌ట‌న‌తో బిఆర్ఎస్ పార్టీని వీడి వేరు కుంపంటి పెడుతుంద‌న్న వాద‌న‌ల‌కు…

Read More
Optimized by Optimole