హైదరాబాద్: గాంధీభవన్లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చుని నీతి పాఠాలు చెప్పే అర్హత కేటీఆర్ కి లేదని ధ్వజమెత్తారు. ‘‘భార్య భర్తల మధ్య ఉన్న వ్యక్తిగత సంభాషణలను ఎలా వినగలుగుతాడు? 65 ఏళ్ల వృద్ధులే కేటీఆర్ పనితీరును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,’’ అని మెట్టుసాయి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రజల పరువు బజారున పడేసినందుకు కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘‘కేటీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతాడు. ఆయనలో ఇంగ్లీష్ ఫుల్ కానీ సబ్జెక్టు నిల్. రేవంత్ రెడ్డి అరగంట బీఆర్ఎస్ గురించి ఆలోచించినా ఆ పార్టీలో నలుగురు తప్ప ఎవరూ మిగలరు. బీఆర్ఎస్ పార్టీ అంటే గతం మాత్రమే. కల్వకుంట్ల కుటుంబం ఎప్పటికప్పుడు రేవంత్ పేరు కోటి సార్లు పలుకుతున్నారు. నిజానికి అది కల్వకుంట్ల కుట్రల కుటుంబం,’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ మాట్లాడే తీరు చీప్ గా, చిల్లరగా ఉంటుందని వ్యాఖ్యానించిన ఆయన “బట్టేబాజ్ కేటీఆర్ తెలంగాణ ప్రజలకు నేరుగా క్షమాపణ చెప్పాలి,” అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లేనివ్వాల్సి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కనీసం 90 సీట్లు వచ్చేవని మెట్టుసాయి స్పష్టం చేశారు.