చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ ఉంటే ఆ మజానే వేరు. రెండు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతుంది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డక.. ఇప్పుడు టి 20 ప్రపంచ కప్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి.
ఇకపోతే ఈ మ్యాచ్లో కోహ్లీసేన హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ దే పైచేయి.
కాగా పాక్ మ్యాచ్ కంటే ముందురోజే తమ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టు బలంగా కనిపిస్తోందని అన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును అశ్రద్ధ చేయకూడదని, అందులోనూ గేమ్ ఛేంజర్స్ ఉన్నారని అభిప్రాయపడ్డాడు.
మరోవైపు పాకిస్థాన్ సీనియర్ ఆటగాడు ఇంజామామ్ ఉల్ హక్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియానే టైటిల్ ఫేవరేట్ అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసిన భారత జట్టు ఛాంపియన్ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంజామామ్ పేర్కొన్నాడు.