ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్ రాత మారలేదు. శనివారం లఖ్నవూ చేతిలో జరిగిన ఆరో మ్యాచ్లోనూ ముంబై జట్టు18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లఖ్నవూ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20ఓవర్లలో 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే, క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి జట్టు 181 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో బ్రెవిస్ ,సూర్యకుమార్ ఉన్నంతసేపు పోరాడారు. లఖ్నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లతో సత్తాచాటాడు. హోల్డర్, రవి బిష్ణోయ్, స్టోయినిస్, చమీరా తలో వికెట్ తీశారు.