కోల్కతా చిత్తు..హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలను దూసుకెళ్తోంది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన పోరులో 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించి.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ రాణా (54) అర్ధసెంచరీ తో ఆకట్టుకోగా.. రసేల్ (49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2.. భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, సుచిత్ తలా వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో కోల్ కత్తా.. కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 176 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. రాహుల్ త్రిపాఠి (71), మార్‌క్రమ్‌ (68*) అర్ధశతకాలతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ రెండూ.. ప్యాట్ కమిన్స్‌ ఒక వికెట్ తీశారు.

Optimized by Optimole