రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్..IRCTCలో కొత్త సదుపాయం..

Sambasiva Rao:

===============

ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ‌. ప్ర‌యాణికుల కోసం ఈఏంఐ పేరుతో కొత్త సేవ‌ల‌ను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఇ-కామర్స్‌ వేదికలపై కొనుగోలు చేసే వ‌స్తువుల‌కు ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఐఆర్‌సీటీసీలోనూ ఇకపై కొనుగోలు చేసే ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా న‌గ‌దు  చల్లించ‌వ‌చ్చు. ఇకపై ఈ సేవలు ఐఆర్‌సీటీసీకి సంబంధించిన‌ రైల్‌ కనెక్ట్‌ (IRCTC Rail Connect) యాప్‌లో లభ్యమవుతాయి.

 ఐఆర్‌సీటీసీ ప్ర‌యాణికుల కోసం ‘ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి’ (Travel now pay later- TNPL) సేవలను తాజాగా ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. ఇందుకోసం క్యాష్ఈ సంస్థతో జట్టుకట్టింది. ఇకపై రైలులో ప్ర‌యాణించాల‌నుకులే ప్ర‌యాణీకులు టికెట్‌ బుక్‌ చేసుకున్నాక టికెట్ డ‌బ్బును వాయిదా రూపంలో చెల్లించొచ్చు. ఆరు నుంచి ఏనిమిది వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నారు. 

సాధారణ, తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో క్యాష్‌ఈ ఈఎంఐ సేవలను పొందొచ్చు. రైల్‌ కనెక్ట్ యాప్‌ వాడే వారందరూ ఆటోమేటిక్‌గా ఈ సదుపాయాన్ని పొందొచ్చు.  దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్‌ అవసరం లేదని క్యాష్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే టికెట్ బుక్ చేసుకొనే స‌మ‌యంలో కొత్త న‌గ‌దు చెల్లించాలి. ఆ త‌ర్వాత మిగ‌త న‌గ‌దు వాయిదాల ప‌ద్ద‌తిలో చెల్లించ‌వ‌చ్చ. న‌గ‌దు చెల్లించే కాల వ్యావ‌ధి ఆధారంగా వ‌డ్డీ ఉంటుంది.

 

Optimized by Optimole