జనసేన నాయకులు, వీర మహిళలకు విలువైన సూచనలు చేసిన జనసేనాని…
APpolitics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వీర మహిళలు, జన సైనికుల దృష్టి మళ్లించడానికి.. భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుటీల రాజకీయాన్ని అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఏంతైనా ఉందన్నారు. జనసేన పట్ల సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు.. పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని పార్టీ శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందన్న పవన్.. పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండని. . వారి సూచనలు, సలహా మేరకు మాట్లాడండని జనసేనాని సూచనలు చేశారు.
కాగా పార్టీలోని నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుందని కనుక సదా అప్రమత్తంగా ఉండాలని జనసేనాని హెచ్చరించారు. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోని.. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలని ఆయన సూచించారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దన్నారు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండని.. అది పార్టీకి, సమాజానికి కూడా హితం కాదని జనసేనాని హితువు పలికారు.
ముఖ్యంగా ఈ విషయాలను మరిచిపోకండని అంటూ పవన్ జనసేనికులకు సూచనలు చేశారు.
1. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి.
2. కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాల గురించి మాట్లాడకండి.
3. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలు చేసే
నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా.
4. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్న చితక నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు .