నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో కంటివెలుగు -2 వైద్య శిబిర కార్యక్రమాన్ని ఎస్పీ అపూర్వరావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది, వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారందరికి ఒకే రోజు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి.. పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ వైద్య శిబిరాన్ని కొనసాగించడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నరసింహ రెడ్డి, రమేష్, ఏ.ఓ మంజు భార్గవి,సీఐ లు ఆది రెడ్డి,వీర రాఘవులు, మహేశ్వర్, సత్యం ఆర్.ఐ లు స్పర్జన్ రాజ్,హరిబాబు,శ్రీను,సంతోష్, పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ కుమార్,పోలీస్ అధికారుల సంఘం నాయకులు సోమయ్య, సిబ్బంది పాల్గొన్నారు.