MitrMyfriend: పిల్లలు ఎదిగే వేళ.. తల్లులు ఒంటరిగా మిగిలే వేళ..!
విశీ: బిడ్డ పుట్టగానే స్త్రీ తల్లి అవుతుంది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. బాల్యం దాటి, యవ్వనంలోకి అడుగుపెట్టి, ప్రపంచాన్ని విస్తృతం చేసుకుంటూ ముందుకు సాగి, ఇంకా ఇంకా మరెన్నో సాధించాలనే తపనతో ఉన్నప్పుడు తల్లులు ఇంకా తల్లులుగానే ఉంటారు. తల్లితనాన్నే ఆస్వాదిస్తూ, ఒకానొక దశ తర్వాత ఆ తల్లితనంలోనే చిక్కుకుపోతుంటారు. రాముడు అంతఃపురం దాటి, మిథిల చేరి, ఆపై అడవులకు వెళ్ళి, రావణ సంహారం చేసినా అతను కౌసల్య తనయుడే! రాజమాత అక్కడే మిగిలింది. అక్కడే…
Telangana: సీఎం రేవంత్ నాయకత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: పటేల్ రమేష్ రెడ్డి
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ లగచెర్ల లో కలెక్టర్ పై దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్ది అమాయక ప్రజలను రెచ్చగొట్టారని.. కేటీఆర్…
Telangana: అధికార, విపక్షాల మాటల రాజకీయంతో ప్రజలకు మేలు జరిగేనా..?
Raparthy vinod Kumar : తెలంగాణ లో ఒక్క ఘటనతో రాష్ట్ర రాజకీయాలు అమాంతంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కులగణన ఓవైపు …. మరోవైపు ఫార్మా సిటీ పేరుతో వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూముల సేకరణకు వెళ్లిన కలెక్టర్ పైదాడి ఘటనలు గత వారం రోజులుగో పేపర్లో హెడ్ లైన్స్ గా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ లు అయ్యాయి. కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పిన.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నారు. మూడు…
Tribute: నిరాడంబరంగా వుప్పుల నరసింహం అంత్యక్రియలు..
Jampala Praveen: కథా రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగాయి. జర్నలిస్టుగా, సాహితివేత్తగా రాణించిన నరసింహంకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు, సాహితివేత్తలు భారీగా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన మృతితో సాహితీలోకానికి తీరని లోటని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. రచయితగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. నరసింహం మొదటగా ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు.సబండ వర్ణాల సారసత్వం,వాదం, మట్టి మనిషి కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం,…
tribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ
Raparthy vinod Kumar: అంతరాలను పూడ్చటమే కాదు… వారి వారసత్వం, గిరియువత సాధికారత లక్ష్యం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ.. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత,…
childtrafficking: పసిచెక్కిళ్ల మీద జారే కన్నీటి చుక్కల కథ..!
విశీ: పొద్దున్నే లేస్తాం. పనుల మీద రకరకాల ఆఫీసులకు వెళ్తాం. రాత్రి ఇంటికి చేరుకుంటాం. మధ్యలో ఫోన్లు, ఇంటర్నెట్ ఉన్నచోట బ్రౌజింగ్. సినిమాలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు. కొందరివి జీవనపోరాటాలు. మరికొందరివి ఆనందాల కేరింతలు. కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ క్షణాన ఈ పోస్ట్ చదివే సమయంలో ఎక్కడో ఒక చోట ఒక బాలుడు తన తల్లి కోసం కలవరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఓ చిన్నారి అమ్మ కావాలని, అమ్మను చూడాలని అలమటిస్తూ ఉంటుంది….
Karthikapournami: కార్తీక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం మహిమ..!
Karthika pournami: కార్తీక పౌర్ణమి హైందవులకు పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ..దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథననుసరించి కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజుగా కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. వెయ్యేళ్ళ రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా ఈరోజు మహాశివుడు తాండవం చేశాడని పురాణల్లో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి హరిహరులకు ప్రీతికరమైన రోజు. అగ్నితత్వమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన…
Telangana: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి: మంత్రి తుమ్మల
Vinod: తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని, పసుపు రైతుల చిరకాల ఆకాంక్షను కేంద్రం గౌరవించాలని.. గతేడాది అక్టోబర్ లో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరారు. రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్ ప్రధానమైనమైందని, గత…