Telangana: తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలపై రచ్చ..!!

Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది.అధికార ,ప్రతిపక్ష నేతల మాటల తూటాలు పేలుతున్నాయి.తాజాగా కేటీఆర్ చేసిన తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘హిట్లర్ నియంత పాలన’ గురించి మాట్లాడితే ఎవరికైనా మొదట గుర్తు వచ్చేది కేసీఆర్ ఆయన పదేళ్ల విధ్వంస పాలన. అందువల్లే ఆయన కాలగర్భంలో కలిసిపోయారని సంగతి మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో…

Read Full News

Karimnagar: ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ నజరాన..!

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ శుభవార్త. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్…

Read Full News

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఎప్పుడు వెలిగించాలి? పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా 360 వత్తులను వెలిగించవచ్చు.కార్తికమాస పౌర్ణమి నాడు వెలిగించడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది.ఆలయాల్లో, దీపోత్సవాల్లో ఈ దీపదానం చేయడం సత్కార్యం.ఇంటివద్ద వెలిగించాలనుకుంటే సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, లేదా పౌర్ణమి నాడు తులసి కోట వద్ద…

Read Full News

Apnews: కూటమి ప్రభుత్వములోనే రైతులకు న్యాయం: మంత్రి నాదెండ్ల

విజయవాడ, నవంబర్ 5: కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.బుధవారం విజయవాడ సివిల్ సప్లై భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే రూ.12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4041…

Read Full News

crime: మగవారూ అత్యాచార బాధితులే..!

విశీ: NOTE: ఇది సెన్సిటివ్ టాపిక్. పూర్తిగా చదివి అవగాహనకు రండి. * పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రాత్రిపూట ఓ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు అతణ్ని ఏదో అడ్రస్ వివరాలు అడిగారు. అతను వివరాలు చెప్పగా, కారులో వచ్చి చూపించమని అడిగారు. అతను కారు ఎక్కగానే బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పరువు పోతుందని అతను ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. చివరకు స్నేహితులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. *…

Read Full News

Apnews: మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: పవన్ కళ్యాణ్

Apnews: మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు….

Read Full News

Apnews: కౌలు రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వాలు…!!

Apnews: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవశేష ఆంధ్రప్రదేశ్లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏరాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు…

Read Full News

Hyderabad: మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల బాగోతం…!!

Hyderabad:  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల‌ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మరోసారి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేసిందని కేటీఆర్ ప్రదర్శించిన వివరాలలోని డొల్లతనం తేటతెల్లమైంది. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, 19,000 ఓటర్లను జాబితాలో చేర్చార‌ని, ఇందులో 1,942 ఓటర్లు పలుమార్లు నమోదయ్యారని, యూసుఫ్‌గూడ‌లోని రెండు చిరునామాలలో వ‌రుస‌గా 32, 43 మంది ఓటర్లు, హైలం కాల‌నీలో అడ్ర‌స్సులేని చిరునామాలో 42 మంది ఓటర్లు ఉన్నారని…

Read Full News

Jubileehills: హీటెక్కిన ఉప ఎన్నిక- పీజేఆర్ వారసుల బహిరంగ సవాల్…!

Jublihills: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. నేతల సవాళ్లు–ప్రతిసవాళ్లతో ఉప ఎన్నిక హీటెక్కింది. తాజాగా ఉప ఎన్నిక పోరులో కుటుంబ సభ్యులే రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. పీజేఆర్ వారసులైన అక్క–తమ్ముడు మధ్య సాగుతున్న సవాళ్లు_ ప్రతి సవాళ్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి. కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్‌లో ఎగరేస్తానని అక్క విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ జెండా ఎగరనీయనని తమ్ముడు విష్ణు వర్ధన్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో…

Read Full News

Telangana: కేసిఆర్ ఫోటో లేకుండా కవిత ప్రయాణం..!

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో తన తండ్రి కెసిఆర్ ఫోటోకి బదులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో వాడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.దీనికి తోడు అక్టోబర్ నెలాఖరులో ఆమె కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం లక్ష్యంగా కవిత భారీ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తూ, రెండు…

Read Full News
Optimized by Optimole