Telangana: సోనియా గాంధీ జన్మదినొత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం : టీపీసీసీ మహేష్ కుమార్
INCTELANGANA: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినొత్సవాన్ని డిసెంబర్ 9 వతేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.మాజీ సీఎం కెసిఆర్ ను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల పండుగని.. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదని అన్నారు. శుక్రవారం మహేష్ గౌడ్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది….
BJPTELANGANA: ‘వొళ్లంచితేనే కల ఫలించేది’..!
BJPTELANGANA: ‘‘అండగా ఉండేందుకు ప్రజల వద్దకు కాక…. మీరెక్కడికి వెళ్లారో నాకు తెలుసు! ముఖ్యమంత్రిగా ధరించే కొత్త వస్త్రాలు కుట్టించుకునేందుకు ముందే పోటీలు పడి టైలర్ దగ్గరికి వెళ్లారు….’’ అని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ మందలించే స్థితి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు తెచ్చుకున్నారు? ‘ఎవరి గోల వారిదే’ అన్నట్టు రాష్ట్ర నాయకుల అనైక్యత వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సిన ఫలితం దక్కలేదని కేంద్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. వారికా మేర సమాచారముంది….
GHMC: పేదల పొట్ట కొట్టడం జీహెచ్ ఎంసీకి తగునా..?
Hyderabad: ఏ తల్లయినా తన పిల్లలను తానే చంపుకుంటుందా? జీహెచ్ఎంసీ అలాంటి పనే చేసింది! రామంతాపూర్ లో రోజూ 300 మంది ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్ ని సీజ్ చేసింది. కారణం ఏంటో తెలుసా? విస్తార్లతో పక్కనే చెత్త పేరుకుపోతోందని!! రోజూ అన్నం తిన్న తర్వాత విస్తార్లను పక్కనే పాలిథిన్ సంచిలో ప్యాక్ చేస్తారు. కానీ, రాత్రిపూట కుక్కలు ఆ సంచిని చింపేస్తుండటంతో పొద్దున్నే చెత్త పేరుకుపోతోంది. దీంతో పారిశుధ్య కార్మికులకు ఆ చెత్తను తొలగించడం…
supremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!
AntiDefectionAct: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్టం, ఇదే రూపంలో… ఆశించిన ఫలితాలిచ్చే జాడ కనిపించట్లేదు. నిర్ణయాధికారం స్పీకర్దేనని, దానికి గడువు విధించలేమని న్యాయస్థానం తేల్చడంతో… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై నిర్ణయం…
Telangana:KGVB పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి..
SuryaPeta: ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట మండలం ఇమాంపేట (KGVB) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం,విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. విద్యార్దినిలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు,…
Karimnagar: విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా: బోయినపల్లి ప్రవీణ్
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వంలో చలనంలేదని మండిపడ్డారు. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ స్పందిచకపోవడం విడ్డురంగా ఉందన్నారు. తక్షణమే ఘటనలపై విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో…
Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం : ఎస్ఎఫ్ఐ
Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు చరణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ చేయడం జరిగిందని అన్నారు. గత నెల రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలవడం.. చనిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు పట్టింపులేనట్లు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ తక్షణమే విచారణకు…
INC: కష్టాల కడలి ఈదుతున్న కాంగ్రెస్..!
INC: ‘‘మొదలు మొగురం కానిది కొన దూలమవుతుందా?’’ అని సామెత. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. మొగురం (స్తంభం) కన్నా దూలం (ఇంటి నిర్మాణంలో మొగురాలపై అడ్డంగా పరిచే బీమ్) వ్యాసపరిధి ఎక్కువ. ఓ చెట్టు ఖాండపు మందం మొగరానికే సరిపోనపుడు, ఇక ఆ చెట్టు కొన దూలానికి సరిపోవడం అసాధ్యమనే అర్థంలో వాడతారు. ఒకటి తర్వాత ఒకటి… రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి….