నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు.
ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది పరీక్షలకు హాజరయ్యారని ఎస్పీ తెలిపారు. వీరిలో 12 వేల 124 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. పురుషులు 19 వేల 260 మంది హాజరు కాగా..9 వేల 235 మంది.. మహిళా అభ్యర్థులు 4 వేల 264 మందికి గానూ.. 2 వేల 889 మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఈ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి కె.ఆర్.కె ప్రసాద్ రావు, యస్.బి. డి.యస్.పి మోగిలయ్యతో పాటు ఇతర పోలీసు సిబ్బంది, ఐటీ కోర్,మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు.