Biharelection: బీహార్ లో ఎన్డీఏ జయకేతనం – పీపుల్స్ పల్స్..!!

Biharelection2025: జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.   కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీ(యూ) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్ లో బీజేపీ, జేడీ(యూ)  పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టంగడుతున్న బీహార్…

Read More
tdp,janasena,bjp,

APpolitics: రైతుల గోడు పట్టని ఏపీ కూటమి సర్కార్..!

APpolitics: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా కాగితాల్లోనే మిగిలిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్ర నిరాశ, నిట్టూర్పులతో అలమటిస్తోంది! వ్యవసాయం నిర్లక్ష్యాన్ని బట్టి చంద్రబాబు మునుపటి వైఖరి మారలేదనే స్పష్టమౌతోంది. కూటమిలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ లు చేరి ఇచ్చిన ఎన్నికల ఉమ్మడి హామీల అమలుకూ రైతాంగం నోచుకోవడం లేదు. హామీల మేరకైనా వ్యవసాయ సమస్యల్ని తీర్చి చరిత్ర గతిని మారుస్తారా? ఇదే నిర్లక్ష్యం కొనసాగించి చరిత్రహీనులుగా మిగులుతారా?…

Read More

National: బీహార్ లో మళ్లీ కులాల కుంపటేనా..?

BiharElection: ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగ ప్రవేశం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన…

Read More

APpolitics: కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు: డిప్యూటీ సీఎంపవన్

NDA: గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణిని చూశారు… ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసన సభ్యుల్లో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ సంప్రదాయం’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో, సమష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా రెండు రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read More

APNEWS: గ్రామాల్లో పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సిఎంపవన్

PawanKalyan:   ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏపీ లో కూటమి పాలన( ఎన్డీయే )మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఆయన  స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి…

Read More

Modi:పదేళ్ల పాలన ట్రెయిలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటున్న మోదీ

Nancharaiah merugumala senior journalist: ఇది ట్రెయిలర్‌ మాత్రమే, అసలు పని పూర్తవ్వాలంటే ఇంకా సమయం కావాలి:మోదీ ‘ ప్రధానమంత్రిగా నా పదేళ్ల కృషి కేవలం ట్రెయిలర్‌ మాత్రమే, ఇంకా నేను ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది, ’ అని నరేంద్రమోదీ మంగళవారం అహ్మదాబాద్‌ లో ప్రకటించారు. మరి ‘మిగిలిపోయిన పనులు’ పనులు పూర్తి చేయడానికి భారత ఓటర్లు మరో పదేళ్లు ప్రధాని కుర్సీలో మోదీని ఉండనిస్తే…చివరాఖరుకు (2034) ఆయన 84 సంవత్సరాల దగ్గరకు చేరుకుంటారు….

Read More

NDA: 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటనలో వాస్తవమేంత?

Nancharaiah merugumala senior journalist: ” 1999 ఏప్రిల్‌ లో వాజపేయి సర్కారు కూలిపోయాక ఎన్డీఏలో టీడీపీ  చేరితే 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటన చెబుతోంది!1996–98 మధ్య యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వినర్‌ గా ఉన్న చంద్రబాబు ఎన్డీఏలో చేరారా? “  టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరిందని బీజేపీ లెటర్‌ హెడ్‌ పై శనివారం విడుదలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ సంయుక్త ప్రకటన చెబుతోంది. వాస్తవానికి జయలలిత ఏఐడీఎంకే మద్దతు…

Read More

Loksabha2024: బీజేపీ ‘ రామబాణం ‘ అస్త్రం..టార్గెట్ 400 సీట్లు..!

Loksabhaelections2024:   లోక్‌సభ  ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ తిరిగి పగ్గాలు చేపట్టకుండా కట్టడి చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంటే, పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ‘ఇండియా’ కూటమితో బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది.  పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ…

Read More

ప్రజాస్వామ్యమా నీవెక్కడ?

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. ‘ఓస్‌ ఇంతేనా ప్రజాస్వామ్యమంటే!’ అనే అభిప్రాయం కలిగేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని అరిష్టాల నడుమ కూడా రాజరికమైనా, కడకు నియంతృత్వమైనా నయమేమో అనిపించేంత అద్వాన్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. 146 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్షన్‌తో బయటకు పంపి, దేశానికి కీలకమయ్యే చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా ఓకే చేయించుకుంది. వాటిపై సమగ్ర పరిశీలన లేదు, అభ్యంతరాలు లేవు, చర్చ లేదు. నూటా యాబై సంవత్సరాలుగా…

Read More
Optimized by Optimole