బిజెపిని ఓడించలేం… ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సలహా
2024లో విపక్షాల ఐక్యతపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అస్థిరమైనది.. సైద్ధాంతికంగా భిన్నమైనది కనుక “ఎప్పటికీ పనిచేయదు” అని ఎన్నికల వ్యూహాకర్త జోస్యం చెప్పారు. ఓజాతీయ చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ ఈవ్యాఖ్యలు చేయడం గమన్హారం. ప్రతిపక్షాల ఐక్యత క్లిష్టతరమైనదని.. పార్టీలను నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. మీడియాలో ప్రతిపక్ష కూటమి పార్టీలు, నాయకులు కలిసి రావడాన్ని చూస్తున్నామని.. ఎవరు ఎవరితో…