Telangana: కేసిఆర్ ఫోటో లేకుండా కవిత ప్రయాణం..!

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో తన తండ్రి కెసిఆర్ ఫోటోకి బదులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో వాడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.దీనికి తోడు అక్టోబర్ నెలాఖరులో ఆమె కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం లక్ష్యంగా కవిత భారీ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తూ, రెండు…

Read More

telangana:మ‌రోసారి అడ్డంగా బుక్కైన కేటీఆర్‌…!!

హైద‌రాబాద్‌: అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం మీద‌ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాగిస్తున్న విష‌ప్ర‌చారం మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది. ప్ర‌తి సంద‌ర్భంలో ఆయ‌న‌ ప్ర‌భుత్వాన్ని నిందిస్తూ త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌లేపుతున్నట్టు రుజువైంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌ న‌కిలీ ఓట‌ర్ల‌ను న‌మోదు చేస్తోందంటూ ఆయ‌న చేస్తున్న దుష్ప్ర‌చారం త‌ప్ప‌ని నిరూపిత‌మైంది. ఓట‌ర్ల న‌మోదు ప్ర‌క్రియ‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలోనే ఓట‌ర్ల న‌మోదు: ఇటీవ‌ల జూబ్లీహిల్స్‌లోని ఒకే ఇంట్లో 43 మంది న‌కిలీ…

Read More

Telangana: సమ్మెల వెనుక అదృశ్య శ‌క్తులు..!!

Telangana: తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రుగుతున్న కొన్ని కీల‌క ప‌రిణామ‌ల వెనుక అదృశ్య‌ శ‌క్తుల‌ కుట్ర ఉంద‌ని ప్ర‌భుత్వం అనుమానిస్తోంది. కేవ‌లం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై క‌క్ష తీర్చుకోవాల‌న్న ఉద్దేశంతో పేదల‌కు విద్య, ఉపాధి, వైద్య స‌దుపాయాల‌ను దూరం చేయ‌డానికి కూడా కొంద‌రు వెనుకాడ‌డం లేద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఉన్న‌త విద్యా సంస్థ‌ల మూసివేత వెనుక‌, ఆరోగ్య‌శ్రీ నిలిపివేత వెనుక‌ కంటికి క‌నిపించ‌ని రాజ‌కీయ శక్తుల ప్ర‌మేయం ఉన్న‌ద‌నే అనుమ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పేద‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్న‌రు! ఇటీవ‌ల తెలంగాణ‌లో…

Read More

Telangana: బిఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న కవిత…!

Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లపై బీఆర్ఎస్ ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు, కేసీఆర్‌ కుటుంబ స‌మ‌స్య‌లు, స్థానిక నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో బీఆర్ఎస్ స‌త‌మ‌త‌మ‌వుతుండ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. వీటికి తోడు తాజాగా బీఆర్ఎస్‌ను క‌ల్వ‌కుంట్ల క‌విత టెన్ష‌న్ పెడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లో క‌విత పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్టు స‌మాచారం. బీఆర్ఎస్‌ను వీడిన అనంత‌రం క‌విత‌ కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు…

Read More

Hyderabad:బీసీ రిజర్వేషన్లపై గందరగోళం…!

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్ట సవరణపై గవర్నర్ ఆమోదముద్రకు సంబంధించి గందరగోళం నెలకొంది. తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం–2025 బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సవరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే, గ్రామీణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల సడలింపుకు ఉద్దేశించిన…

Read More

Hyderabad: కవిత సస్పెన్షన్ బిఆర్ఎస్ గుంట నక్కల కుట్ర…?

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఇటీవల కనిపిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యక్తిత్వ హననం కోసం కొందరు పద్ధతి ప్రకారం కుట్రలు పన్నుతున్నారని పార్టీ అంతర్గత వర్గాలే ఆరోపిస్తున్నాయి.కుట్రలో భాగంగానే కవిత సస్పెన్షన్ జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మొదటగా ఒక స్వయంప్రకటిత మేధావి ద్వారా కవితపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయించి, ఆ వీడియోలను కార్యకర్తల చేత సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో కవితను…

Read More

క‌విత వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు – బీఆర్ఎస్‌కు మ‌రింత న‌ష్టం చేసేలా స్కెచ్‌..!

Telangana: బీఆర్ఎస్ నుంచి సస్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై బుధ‌వారం మీడియాతో మాట్లాడిన క‌విత చివ‌ర్లో వ్యూహాత్మ‌కంగా “జై కేసీఆర్” నినాదాన్ని ఎత్తుకున్నారు. క‌విత ఈ నినాదాన్ని కాక‌తాళీయంగా చేసిన‌ది కాద‌ని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా నిన‌దించ‌డం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మ‌క అడుగులువేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.  కేసీఆర్‌పై గౌర‌వం…

Read More

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తు…!!

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో నియమించబడిన విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఆగస్టు 4న మంత్రివర్గం ఆ నివేదికను ఆమోదించి, శాసనసభ చర్చకు పెట్టింది. 665 పేజీలతో కూడిన నివేదికలో…

Read More

Telangana: శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం ఎన్నిక…చైర్మన్గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి…!

సూర్యాపేట:  ఆత్మకూరు (s) మండలం శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి,( కాంగ్రెస్ పార్టీ లీడర్ )పాలక వర్గం సభ్యులు ఎన్నికైన్నారు. ఈ ఎన్నిక సందర్బంగా నూతన ఛైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి నరోత్తమ్ రెడ్డి, వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణ రెడ్డి, మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్బంగా…

Read More

కవిత ఫైర్‌: “జగదీష్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు!”

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారం మీడియాతో కవిత మాట్లాడుతూ..BRS పార్టీలోని ఒక ముఖ్య నేత, తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని…ఆ నాయకుడికి చెబుతున్నా… మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై…

Read More
Optimized by Optimole