Hyderabad: యువత, మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా వేదిక: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల…