ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల పోరు …

ఎన్నికలకు ఏడాది ముందరే  పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్‌ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…

Read More

‘పవన్ ‘అభిమన్యుడు కాదు అర్జునుడు: ఎంపీ రఘురామ

సమాజ హితం కోసం బాబు, పవన్ కలువాల్సిందేనన్నారు ఎంపీ  రఘురామ కృష్ణంరాజు.ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడమే  తక్షణ కర్తవ్యమన్నారు. వ్యక్తిగత మేలు కోసం కాకుండా.. ప్రజల కోసం ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.పసుపు, ఎరుపు రంగు కలిస్తే కాషాయమేనని తేల్చిచెప్పారు.  గతంలో జగన్ ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని రఘురామ గుర్తు చేశారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడం…

Read More

ఉత్తరాంధ్ర సమస్యలపై సీఎం జగన్‌ కి మాజీ ఎంపీ కొణతాల లేఖ ..

ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ.. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.‘‘నీళ్లు`నిధులు`నియామకాలు’ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలు..వివక్షత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఉత్తరాంధ్ర నుండి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది వలసలు పోతున్నారని.. ఒక్క హైదరాబాదులోనే 15 లక్షల మంది ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు వాచ్‌మెన్‌లుగా, చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నట్లు మీడియాలో అనేక కథనాలు వచ్చిన…

Read More

వైసీపీ నాయకుల చవకబారు మాటలు మానుకోవాలి: నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ మంత్రులు ఉలిక్కిపడడం చూసి జాలేస్తుందని ఎద్దేవ చేశారు. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కుటుంబ సభ్యులను.. అలాగే  గ్రంధి సన్యాసి రాజుని… రాజాంలోని వారి నివాసంలో  మనోహర్ ఆత్మీయంగా కలిశారు. అనంతరం ఆయన మీడియతో  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు….

Read More

గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా?

గవర సోదరుడు బుద్ధా వెంకన్న..గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా? ———————————————– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో- రెడ్డి, కమ్మ, కాపు ఆధిపత్య, ప్రేరేపిత రాజకీయాలపై పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న రాజుగోరు పెన్మత్స రాంగోపాల్ వర్మ నోటికొచ్చినట్టు కామెంట్ చేయగూడదంటే ఎలా? గోదారి జిల్లాల రాజులు చేపలు, రొయ్యల పెంపకంలో కూడా రాణించినంత మాత్రాన వారిని అగ్నికుల క్షత్రియులను (బెస్త/మత్స్యకారులు) బెదిరించే రీతిలో బెజవాడ బుద్ధా వెంకన్న మాట్లాడడం న్యాయమా? ఉత్తరాంధ్ర నుంచి వలస…

Read More

మత్స్యకారులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల మనోహర్

ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విద్య, వైద్యం, వలసల నిరోధం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేహీ అంటూ అడుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఆయన..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు.  ఇక…

Read More

పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ

ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలన్నారు. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు.. పందికొక్కుల్లా మారి  ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. పతనం అంచున  పోలీస్ ప్రభుత్వం.. పతనం అంచుల్లో ఏపీ పోలీసు ప్రభుత్వం ఉందని…

Read More

ఏపీ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: నాదెండ్ల

వివేకానంద జయంతి పురస్కరించుకుని జనసేన తలపెట్టిన యువ శక్తి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లభించిందన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.  రణ స్థలంలో సభా స్థలిని జనసైనికులతో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టిన జగన్ ప్రభుత్వం మీద రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  యువతరం భవిష్యత్తు కోసం నిర్వహించే కార్యక్రమానికి యువత…

Read More

ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ

ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు. బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని…

Read More

జగన్ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అన్యాయం : ఏపీసీసీ రుద్రరాజు

విజయవాడ: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎనిమిదిన్నరేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లను ఓటు బ్యాంకు గా వాడుకొని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు..మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింపచేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.  ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ త్వరలోనే అమలు చేయబోతున్నట్లు రుద్రరాజు వెల్లడించారు.జనవరి…

Read More
Optimized by Optimole