యాదాద్రిలో భారీ స్వాగత తోరణం..

యాదాద్రిలో భారీ తోరణం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. పంచనారసింహుల ఆలయ వైభవానికి అనుగుణంగా భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం కానున్నట్లు సమాచారం. కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య 40 అడుగుల ఎత్తు.. 40 అడుగుల వెడల్పుతో ఈ తోరణానికి అధికారులు రూపకల్పన చేశారు.స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో దివ్య విమాన రథోత్సవం సాదృశ్యమయ్యేలా ఐరావతం, తీర్ధజనుల దృశ్యాలను తోరణంలో తీర్చిదిద్దారు.

ఇటీవల యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఆధ్మాత్మికతకు అద్దంపట్టేలా వైటీడీఏ ప్రత్యేకంగా దృష్టిసారించి సిమెంట్ తో భారీ స్వాగత తోరణాన్ని నిర్మించింది. వైష్ణవత్వం ప్రస్ఫుటించేలా కొండపైన పంచనారసింహుల ప్రాంగణానికి చేరే దిశలో… కొండ దిగేటప్పుడు తోరణంపైన వెనకా, ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రూపం, ఇరువైపుల గరుడాళ్వరుడు, అంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటుచేశారు. మూడు స్తంభాలతో రూపుదిద్దుకున్న ఆ తోరణానికి ఇరువైపులాద్వారా పాలకులు, మధ్యలో మహావిష్ణుమూర్తి రూపం కిందిభాగంలో యక్షులు దర్శనమిస్తారు. 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole