ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్న కేసీఆర్ కుట్రను ఛేదించాలి :టీపీసీసీ రేవంత్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ రేవంత్ రెడ్డి  నిప్పులు చెరిగారు. అధికారాన్ని పదిలం చేసుకోవడానికి.. కేసిఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు.  2014 నుంచి సిఎం కేసిఆర్  ఇదే తరహ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదని..రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగిస్తునే ఉన్నారని  ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారని.. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులకు ప్రోత్సహించారని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా.. స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదన్నారు. అంతేకాక పార్టీ మారిన సభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు.. ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారని రేవంత్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే..కేసీఆర్ ఫిరాయింపు రాజకీయానికి సమాధి కట్టాలని పిలుపునిచ్చారు  రేవంత్. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాలని డిమాండ్ చేశారు.పోలీస్ స్టేషన్ కు వస్తే ఉన్నతాధికారులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 455 ఎఫ్.ఐ. ఆర్. తో పాటు మేం ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించి విచారణ చేపట్టాలన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని.. పోలీస్ స్టేషన్ లొనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా వివరాలతో ఫిర్యాదు చేస్తామన్నారు. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేయడానికీ కూడా వెనకాడబోమని రేవంత్ తేల్చిచెప్పారు.

Optimized by Optimole