National: కేరళలో యూడీఎఫ్ సర్కార్: పీపుల్స్ పల్స్

National: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో…

Read Full News

vandematram: వందేమాతరం దేశ సమైక్యతకు ప్రతీక..!!

Vandematram: భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్‌ వేదికగా ‘వందేమాతరం’…

Read Full News

Haryana:హర్యానాలో అంచనాలు తలకిందులకి కారణాలు…!

Haryana elections2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడంతో రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేయడంతో పాటు అన్ని సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో ఒక్క శాతంలోపు ఓట్ల వ్యత్యాసంతో దోబూచులాడిన ఫలితం చివరికి బీజేపీకి పట్టంకట్టి, కాంగ్రెస్ను నిరాశకు గురిచేసింది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో నువ్వా నేనా అన్నట్టు తలపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం పది స్థానాల్లో చెరో ఐదింటిని సాధించడంతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్పై అంచనాలు పెరిగాయి. ఐదు నెలల…

Read Full News

Congress: ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి..!

Exitpolls2024:  ” పోల్ బాయకాట్ చేయకుండా… ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ”  ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితులు సజావుగా లేవని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చేవిగా ఈసీ పోకడలు కనిపించడం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ అసలు పోల్ బాయకాట్ ప్రకటించాల్సింది. ఎందుకో అంతటి గొప్ప సాహసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ) చేయలేదు. కానీ శనివారం సాయంత్రం అన్ని మీడియా వేదికల…

Read Full News

Rahul Gandhi: ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే రాహుల్ కి అత్యంత సురక్షిత స్థానం..

Nancharaiah merugumala senior journalist: అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్‌ గాంధీ మనవడు రాహుల్‌ కు ఇబ్బందికరమే మరి.. ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం ఒక గుజరాతీ జొరాస్ట్రియన్‌ (జుబిన్‌ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్‌ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇష్టం లేదనుకుంటా. తొలి ప్రధాని…

Read Full News

Revanthreddy: రేవంత్‌ మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.

Nancharaiah merugumala senior journalist:  ” కేరళ కాంగ్రెస్‌ సమరాగ్ని సభలో రేవంత్‌ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్‌ దగ్గర మార్క్సిస్ట్‌ సీఎం విజయన్‌ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా?  “ గురువారం హైదరాబాద్‌ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్‌ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో…

Read Full News

అమ్మాయిలను ఎరగావేసే విష సంస్కృతి..అమెరికాలోనే కాదు ఇండియాలోనూ..!

Nancharaiah merugumala senior journalist: ” శక్తిమంతులు, సెలబ్రిటీలకు ఆడపిల్లలను ‘సమకూర్చే’  సంస్కృతి అమెరికాలోనే కాదు.. మన హైదరాబాద్, బెజవాడల నుంచి న్యూఢిల్లీ వరకూ విస్తరించి ఉంది!..1980లు, 90ల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ అబ్జర్వర్లకు మరవలేని, మరపురాని ‘ఆతిథ్యిం’ “ వయసులో ఉన్న ఆడపిల్లలను డబ్బు ఎరవేసో, బెదిరించో లేదా మాయ మాటలతోనో లొంగదీసుకుని అధికారంలో ఉన్న నాయకులకు, సెలిబ్రిటీల దగ్గరకు పంపించే వ్యాపార–రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడకో లేదా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కో పరిమితమై లేదు. జాతీయ…

Read Full News

రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?

Nancharaiah merugumala senior journalist: ” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?” కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్‌–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ  రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్‌–డిసెంబర్‌ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  పీసీసీ అధ్యక్షుడు ఎనుముల…

Read Full News

ప్రజాస్వామ్యమా నీవెక్కడ?

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. ‘ఓస్‌ ఇంతేనా ప్రజాస్వామ్యమంటే!’ అనే అభిప్రాయం కలిగేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని అరిష్టాల నడుమ కూడా రాజరికమైనా, కడకు నియంతృత్వమైనా నయమేమో అనిపించేంత అద్వాన్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. 146 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్షన్‌తో బయటకు పంపి, దేశానికి కీలకమయ్యే చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా ఓకే చేయించుకుంది. వాటిపై సమగ్ర పరిశీలన లేదు, అభ్యంతరాలు లేవు, చర్చ లేదు. నూటా యాబై సంవత్సరాలుగా…

Read Full News

లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు?

Loksabha2024: భారతదేశ రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదం రాతలకు, మాటలకే పరిమితమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కులం, మతం, ప్రాంతీయ అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఏయే వర్గాలతో ఎన్ని ఓట్లు పడతాయనే ధోరణితోనే పార్టీలున్నాయి. 2024 ఏప్రిల్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రధానమైన ముస్లిం ఓటర్లకు సంబంధించి చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్య్రానంతరం ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత రాజకీయాలు సుమారు 14 శాతమున్న ముస్లిం మైనార్టీల…

Read Full News
Optimized by Optimole