×

Bandisanjay: బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ రూరల్ గ్రామాల్లో సాగింది.యాత్రకు అడుగడుగునా ప్రజలు నుంచి అనూహ్య స్పందన లభించింది. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేములవాడ నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. కృష్ణా జిల్లాల వాటా విషయంలో అసెంబ్లీ వేదికగా  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాను బట్టబయలు చేశారు.కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని  కావాల్సిన అవశ్యకతను నొక్కి వక్కాణించారు.

ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ కు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. సంజయ్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి మహిళలూ, యువత ఇళ్ల ముందు వేచి చూశారు.ఆయన రాగానే కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగి ..జై శ్రీరామ్.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. చిన్న పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. సంజయ్ అన్న కి జై..జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సంజయ్ తో అడుగులో అడుగు వేస్తూ యాత్రలో నడిచారు. ఆయా గ్రామాల్లోని చిరు వ్యాపారులు, షాపు యాజమానులు సంజయ్ రాగానే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పార్లమెంట్ ఎన్నికలలో మా ఓటు బీజేపీ కే అంటూ మద్దతు తెలిపారు.

ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంజయ్ నిప్పులు చెరిగారు.అసెంబ్లీలో క్రిష్ణా నీళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీలో నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్లాడుతున్నయ్. కేసీఆర్ ను కడిగిపారేస్తనని సీఎం అంటున్నడు… సీఎం సంగతి చూస్తామని బీఆర్ఎస్ నేతలంటున్నరు. ఈ రెండు పార్టీల నాయకులు ఎంత దుర్మార్గులంటే.. ఆ నాడు కేసీఆర్  ఒక అడుగు ముందుకేసీ తెలంగాణ నీళ్లను రాయలసీమకు ఇచ్చిండట. ఎంత దుర్మార్గమంటే…కేసీఆర్ ఆంధ్రోళ్ల కోసం ఒకడుగు ముందుకేసి… దక్షిణ తెలంగాణ ప్రజల గొంతులను ఎండబెట్టిండు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను ఎడారిగా మార్చిండు. ఇయాళ సాగర్ ఆయకట్టు రైతులు రెండు పంట వేసుకుందామంటే నీళ్లు లేకుండా చేసిండు… ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయి కేసీఆర్ క్రిష్ణా నీళ్లను ఏపీకి తాకట్టుపెడితే… ఈ కాంగ్రెసోళ్లు పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి దక్షిణ తెలంగాణ ప్రజల గుండె మీద తన్నిర్రు… ఆనాడు నిండు అసెంబ్లీలో క్రిష్ణా నీటిని అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా వైఎస్సార్ నీళ్లు తీసుకుపోతున్నారని తెలిసి కూడా నోరు మెదపని దద్దమ్మలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. వీళ్లా క్రిష్ణా నీళ్లపై మాట్లాడేది? సిగ్గుండాలే అంటూ సంజయ్ ద్వజమెత్తారు.

Bandisanjay

అటు వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం రూపంలో సంజయ్ కి ఏకరువు పెట్టుకున్నారు.   శాత్రారాజు పల్లి గ్రామంలోని  పల్లె దవాఖానలో  కరెంట్, వాటర్  సరఫరా లేకపోవడం తో అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను సంజయ్ తెలియజేశారు. గ్రామస్థులకుసమస్యల పరష్కారానికి కృషి చేస్తానని  భరోసా కల్పించారు.

మరోవైపు సంజయ్ యాత్రతో వేములవాడ నియోజకవర్గం బీజేపీ లో జోష్ కనిపిస్తోంది. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో కాషాయ దళంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ఊపును తీసుకొచ్చింది.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole