జగనన్న పోవాలి.. పవనన్న రావాలంటున్న మత్స్యకారులు : నాదెండ్ల మనోహర్

Janasena:‘రాష్ట్రంలో కౌలు రైతుల వెతలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా మత్స్యకారుల వేదనలు ఉన్నాయన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేవలం రూ.10 వేల వేతనానికి మత్స్యకారులు గుజరాత్, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వలసలు వెళ్లి బతుకుతున్నార’ని  ఆయన వాపోయారు. గతంలో మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ సమయంలో పాదయాత్ర చేయాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఓ మత్స్యకార గ్రామాన్నయినా ముఖ్యమంత్రి స్వయంగా సందర్శిస్తే వారి బాధలు, బతుకులు అర్థం అవుతాయని…

Read More

మత్స్యకార భరోసాలో అవకతవకలపై జనసేన పోరాటం: నాదెండ్ల మనోహర్

Janasena: మత్సకార భరోసా పథకం అమల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో మత్స్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ కి వినతిపత్రం సమర్పించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.  మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్న తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరుల్లో ఆందోళన, అలజడి ఉన్నాయన్నారు. గత ఏడాది జాబితాలో ఉన్న పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం వద్ద ఉన్న…

Read More

పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్వీర్యం చేసింది: నాదెండ్ల మనోహర్

Jansena: పోలవరం ప్రాజెక్టుని  జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యలు కేవలం రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన పార్టీ పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే నెలలో…

Read More

కాంగ్రెస్ కి ఓటేద్దాం… బీజేపీని సాగనంపుదాం : గిడుగు రుద్రరాజు

APCONGRESS: 2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దానికి ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలి ఉంది. కానీ, ఇప్పటి వరకూ కనీసం ఒక్క హామీ కూడా బీజేపీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని, 2014 సాధారణ ఎన్నికల…

Read More

జనసైనికులపై దాడి హేయమైన చర్య: నాదెండ్ల మనోహర్

Jansena: ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరలో జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక  చేయమని  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకే పెడన నియోజకవర్గం, ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ సంబంధీకులు దాడి చేసిన ఘటన దురదుష్టకరమని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి జగన్ కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో…

Read More

జై భారత్ సత్యాగ్రహ సభ సక్సెస్.. కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు : ఎపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: జై భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. 1921 సంవత్సరం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్నవాళ్లకు మొన్నటి సభతో కనువిప్పు కలిగిందన్నారు.ఇక అన్ని జిలాల్లో ఇలాంటి సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.కర్ణాటక లో ఉన్న తెలుగు వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నేతలు రఘువీరా…

Read More

జనసేన నాయకులు, వీర మహిళలకు విలువైన సూచ‌నలు చేసిన జ‌న‌సేనాని…

APpolitics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వీర మహిళలు, జన సైనికుల దృష్టి మళ్లించడానికి.. భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని హెచ్చ‌రించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. కుటీల రాజ‌కీయాన్ని అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్ళవలసిన అవ‌స‌రం ఏంతైనా ఉంద‌న్నారు. జ‌న‌సేన ప‌ట్ల సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు.. పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని…

Read More

‘‘యువగళమా .. జనగళమా’’ పాద‌యాత్ర‌పై విశ్లేష‌ణ‌..!!

Yuvagalam:  “ప్రతీ యాత్రకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏ రాజకీయపార్టీ అయినా, రాజకీయ నాయకుడైనా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారితో మమేకమవ్వడానికి చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా అభినందించాల్సిందే. విద్యార్థులు లైబ్రరీకి వెళ్లి జ్ఞానం పొందినట్లే, రాజకీయపార్టీలు, నాయకులు, కార్యకర్తలు వివిధ యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు తెలిసివస్తాయి. ఇది సమాజానికి ఏంతో మేలు చేస్తుంది”  తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ నారాలోకేష్‌ జనవరి 27 వ తేదీన…

Read More

టెక్నాలజీ, పరిపాలన అర్ధమైనంతగా రాజకీయాలు చంద్రబాబుకు అర్ధంకాలేదేమో!

Nancharaiah merugumala senior journalist: ఎన్టీఆర్‌ అంటే ఏమిటో అర్ధంచేసుకోలేని ఇందిరమ్మ, కమ్మ సామాజికవర్గం.. తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 73 ఏళ్లు నిండాయి. తెలుగదేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు గారు 73 సంవత్సరాలు నిండడానికి నాలుగు నెలల ముందే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ రెండింటికీ ఏమీ సంబంధం లేకున్నా వారిద్దరూ మాజీ ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షులు మాత్రమేగాక మామాఅల్లుళ్లు కావడం వల్ల రెండో విషయం చెప్పాల్సి వచ్చింది. 41 ఏళ్ల క్రితం…

Read More

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: ఏపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.  విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరుల సమావేశంలో గిడుగు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాలలో విస్తరించి వున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నొక్కి చెప్పారు. ప్రియతమ ప్రధాని ఇందిరా గాంధీ కల విశాఖ స్టీల్‌…

Read More
Optimized by Optimole