క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం కోటం రెడ్డి పోరుబాట కార్యక్రమం…

NelloreRural: నెల్లూరు రూరల్:   ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమమని  కోటంరెడ్డి అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…

Read Full News

చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు: పవన్ కల్యాణ్

Janasena:వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని కొనియాడారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు.. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు జన సేనాని పేర్కొన్నారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి…

Read Full News

పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?: నాదెండ్ల మనోహర్

Janasena: • వసతి దీవెన, విద్యా దీవెన బటన్లు నొక్కినా నిధులు ఇవ్వలేదు • విద్యార్థుల సరిఫికెట్లు నిలిపివేస్తున్నా పట్టని వైసీపీ సర్కార్ • వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం… బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నాం అని ప్రజలను మోసం చేయడంలో వైసీపీ పాలకులు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు జనసేన నాదెండ్ల మనోహర్. వైసీపీ తప్పుడు ప్రకటనలు, విధానాల వల్ల ప్రజలు..  ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు….

Read Full News

రైతులకు అండగా జనసేన నిలుస్తుంది: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి రైతులు ఆవేదనలో ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విఫలమైందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నీట మునిగిన పంటను చూసి బాధలో ఉన్న రైతు తమ ఆవేదనను పంచుకొనే అవకాశం లేకుండా ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. మీడియా ముందుగానీ, ప్రతిపక్షాల దగ్గరగానీ మాట్లాడితే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తున్న దాఖలాలు మా…

Read Full News

తిరుమల తిరుపతి పవిత్రతను జనసేన కాపాడుతుంది: నాగబాబు

Janasena:వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో అక్రమంగా దోచుకున్నదంతా జనసేన ప్రభుత్వంలో కక్కిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. వైసీపీ నాయకుల ధన దాహానికి అపవిత్రమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాలను జనసేన పాలనలో సరిదిద్దుతామని వెల్లడించారు. స్వార్థపరమైన జీ.ఓ.లు, ఏకపక్ష నిర్ణయాలపై పునః పరిశీలన చేపడతామని అన్నారు. తిరుపతి నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో బుధవారం జరిగిన “వర్చువల్” సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల…

Read Full News

ప్రజా సమస్యల కోసం కృషి చేసే నాయకుడిని: కోటంరెడ్డి శ్రీధర్

NelloreRural: ఐదేళ్లకోసారి కనిపించే నాయకున్ని కాదని..నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకై కృషి చేసే నాయకుడినని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంగళవారం ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు.ఇక ఏ మాత్రం అధికార పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి…

Read Full News

రాజకీయ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : భీశెట్టి బాబ్జి

APpolitics: తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు.పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా అర్థం…

Read Full News

అకాల వర్షాలతో కుదేలైన రైతులను ప్ర‌భుత్వం ఆదుకోవాలి : జ‌న‌సేనాని

janasena: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందని వాపోయారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని సమాచారం అందుతోందన్నారు. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని.. వారికి అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని…

Read Full News

కార్మికుల సొమ్ములు మాయం చేసిన వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మ‌నోహ‌ర్‌

* కార్మిక సంక్షేమ బోర్డు నిధులు రూ.12 వందల కోట్లు ఏం చేశారో జవాబు చెప్పాలి * కార్మిక ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం * ఇసుక కొరతను సృష్టించి కార్మికుల కడుపు కొట్టారు * శ్రమ జీవుల తరుఫున బలంగా పోరాడే నాయకుడు  పవన్ కళ్యాణ్  * విశాఖపట్నంలో మే డే వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  * భవన నిర్మాణ కార్మికులతో సహ పంక్తి భోజనం ‘కార్మికుల సంక్షేమ…

Read Full News

ప్రజల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే పవన్ ఆశయం: నాదెండ్ల మనోహర్

Janasena: ‘రాజకీయాల్లో ఒక నిర్దిష్టమైన మార్పు , ప్రజలు బతుకుల్లో వెలుగులు నింపాలనే ఆశయం కోసం పని చేస్తున్న నాయకుడు  పవన్ కళ్యాణ్ అని కొనియాడారు నాదెండ్ల మనోహర్. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనమంతా ప్రజా క్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఎవరో ఏదో చెప్పారని… ఏదో వాట్సప్ గ్రూపులో సమాచారం వచ్చిందని గాభరాపడొద్దు’ అని సూచించారు. పవన్ కళ్యాణ్  లాంటి గొప్ప మనసున్న నాయకుడు ఎవరూ కనిపించరన్నారు. అలాంటి గొప్ప నాయకుడుని…

Read Full News
Optimized by Optimole