టెక్నాలజీ, పరిపాలన అర్ధమైనంతగా రాజకీయాలు చంద్రబాబుకు అర్ధంకాలేదేమో!

Nancharaiah merugumala senior journalist: ఎన్టీఆర్‌ అంటే ఏమిటో అర్ధంచేసుకోలేని ఇందిరమ్మ, కమ్మ సామాజికవర్గం.. తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 73 ఏళ్లు నిండాయి. తెలుగదేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు గారు 73 సంవత్సరాలు నిండడానికి నాలుగు నెలల ముందే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ రెండింటికీ ఏమీ సంబంధం లేకున్నా వారిద్దరూ మాజీ ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షులు మాత్రమేగాక మామాఅల్లుళ్లు కావడం వల్ల రెండో విషయం చెప్పాల్సి వచ్చింది. 41 ఏళ్ల క్రితం…

Read Full News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: ఏపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.  విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరుల సమావేశంలో గిడుగు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాలలో విస్తరించి వున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నొక్కి చెప్పారు. ప్రియతమ ప్రధాని ఇందిరా గాంధీ కల విశాఖ స్టీల్‌…

Read Full News

ఫూలే మహా శక్తివంతుడు :ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: మహాత్మా జ్యోతిబా ఫూలే గారు గొప్ప శక్తివంతుడని, సంఘ సంస్కర్త అని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఫూలే సేవలను కొనియాడారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌ నందు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. సంస్కర్తలలో గొప్ప సంస్కర్త జ్యోతిబా ఫూలే అని.. కులాల నిర్మూలన కోసం ఆయన తపించేవారని అన్నారు. ఆయన అనేక సామాజిక సేవా సంఘాలను, అనేక పత్రికలను నడిపేవారని, ఆయన…

Read Full News

Nellore: మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Nellore : నిరంతరం వార్తల్లో ఎప్పుడూ ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో విడుదల చేసి ఇప్పటికి 9 నెలలైనా నిధులను మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయన పోరాట పంథా ను ఎంచుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంతకానికే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ…

Read Full News

బతికున్న’ ఏపీ కాంగ్రెస్ ఏకైక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ‘ఏడుపు’ ఇంకా తెలుగు జనానికి గుర్తుంది!

Nancharaiah merugumala senior journalist: ప్రస్తుతం బతికున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏకైక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజనతోనే రాజకీయంగా మరణించిన కిరణ్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మాజీ క్రికెటర్ గానే గుర్తుండి పోయారు. టీమ్ లేకుండానే బ్యాట్ పట్టిన గొప్ప స్కిపర్ కిరణ్. రాజమండ్రి, బెజవాడ మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి గొప్ప రాజకీయ విదూషకులతో ఆసక్తికర నాటకాలాడించారు కిరణ్ రెడ్డి….

Read Full News

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక..

APpolitics: – 2005లో హత్యకు గురైన తండ్రి – ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనం – యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక – సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ,…

Read Full News

‘జగనన్న పాపం పథకం’తో పోలవరం ప్రాజెక్టుకి శాపం: జనసేన నాదెండ్ల మనోహర్

APpolitics: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని పాపం ముఖ్యమంత్రి  జగన్ రెడ్డిదేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టిన తీరుకు జగనన్న పాపం పథకం అని పేరు పెట్టాలన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు నెపం కేంద్రం మీద వేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు మినహా ఈ ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రం నిధులు రీఎంబర్స్…

Read Full News

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..జగనన్నో… జగనన్న .. : ఏపీసీసీ పద్మశ్రీ

APpolitics:ఆంధ్రప్రదేశ్‌ లో గడపగడపకు వెళ్లినా, ఏ తాతను, ఏ అవ్వనడిగినా, ఏ అక్కను, ఏ అన్నను పలకరించినా… వారి మాటల్లోని బాధను, రెండు మాటల్లో కూడగడితే ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. జగనన్నో…జగనన్న’’ అనే వినపడుతున్నది! కారణం, గత నాలుగేళ్ల వైస్సార్సీపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కరెంటు వంటి అత్యవసరాలు మొదలు  పప్పు నుంచి ఉప్పు వరకు నిత్యవసరాల ధరలన్నీ ఆకాశం వైపే పరుగులు తీస్తున్నాయి. బటన్‌ నొక్కి కుడిచేతితో పది రూపాయిలు…

Read Full News

టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం: లోకేష్

టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని శనివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్,…

Read Full News

ఏపీసీసీ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన..

విజయవాడ: బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు  ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లుతెరవాలని ఆయన హితవు పలికారు. సస్పెండ్ చేసిన రోజునే రాహుల్ గాంధీని క్వార్టర్స్ కూడా ఖాళి చేయమని చెప్పడం దుర్మార్గపు చర్య అని రుద్రరాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు…

Read Full News
Optimized by Optimole