ఏపీలో కాంగ్రెస్ ఆఫీసుల‌కు తాళాలు?

ములిగే న‌క్క మీద తాటిపండు ప‌డ్డ‌ట్టు ఆంధ్రప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంది. కోమాలో కొట్టుమిట్టాడుతున్న ఆపార్టీకి జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం బ‌కాయిల రూపంలో ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు, ఆస్తులకు సంబంధించిన‌ బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే క‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. క‌ట్ట‌ని ప‌క్షంలో ఆఫీసుల‌కు తాళాలు ప‌డే అవ‌కాశం ఉందని హెచ్చరికలు పంపింది. ఏపీ పీసీసీ గిడుగు రుద్ర‌రాజు బ‌కాయిల చెల్లింపు విష‌యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ల‌గా.. మాకేం సంబంధం…

Read Full News

2024 ఏపీ కింగ్‌ మేకర్‌ ఎవరు..? జ‌న‌సేన రోల్ ఏంటి?

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి  మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….

Read Full News

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు : పవన్ కళ్యాణ్

APpolitics:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయన్నారు జన సేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ  పట్టభద్రుల నియోజక వర్గాల ఎం.ఎల్.సి. స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సందిగ్ధంలో ఉన్నవారికి…

Read Full News

సీఎం స్టిక్కర్ల కోసం బడ్జెట్ పెట్టినట్లున్నారు: నాదెండ్ల మనోహర్

బడ్జెట్లో కేటాయింపుల ఘనమే తప్ప ఆచరణలో మంజూరు అరకొర అని వైసీపీ పాలన ద్వారా వెల్లడవుతోందని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. 2023-24లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల హంగామా తప్ప మరేమీ లేదన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గురించి కాకుండా ఇళ్లకు స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించడానికి కూడా నిధులు ఇవ్వడాన్ని ఏమనాలని? ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వమని…

Read Full News

ఏపీ అప్పుల‌పై జ‌న‌సేన కార్టూన్ కు అదిరిపోయే రెస్పాన్స్‌…

APPOLITICS : జ‌న‌సేన 10 వ ఆవిర్భావ స‌భ‌ సూప‌ర్ స‌క్సెస్ తో ఆపార్టీలో జోష్ నెల‌కొంది. పార్టీ నేత‌లు , కార్య‌క‌ర్త‌లు స‌రికొత్త ఉత్సాహంతో ప‌నిచేస్తున్నారు. జ‌న‌సేన‌ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ సంగంతి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈనేప‌థ్యంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల గురించి జ‌న‌సేన రూపొందించిన కార్టూన్ సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తోంది. అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్ అయితే నెంబ‌ర్ టూ స్థానం తెలంగాణ.. ఇక మ‌న‌దే అప్పుల రాష్ట్ర‌మ‌ని అరిచేవాళ్ల నోరు…

Read Full News

జనసేన ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది: నాదెండ్ల మనోహర్

బెజవాడ కృష్ణమ్మ జన సునామీతో ఉప్పొంగిందా..? బందరు సముద్ర తీరం ముందుకు వచ్చిందా అన్నట్లు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఇంత జనమా? అనే ఆశ్చర్యం కలిగే రీతిలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి తరపున, పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ పదో ఆవిర్భావ…

Read Full News

ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?

Nancharaiah merugumala : (senior journalist) కాపులు ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపు ఇచ్చాక బీసీలు, ఎస్సీలు భయపడే ప్రమాదం లేదా? ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత? ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చిన్న కులాలకు భయపడరు. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి,’’ ఇలా సాగింది మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ…

Read Full News

సోష‌ల్ మీడియాలో ‘బంద‌రులో జ‌న‌స‌ముద్రం- వైసీపీ శ్రేణుల్లో క‌ల‌వ‌రం’ కార్టూన్ వైర‌ల్‌..

APPOLITICS: మ‌చిలీప‌ట్నం జ‌న‌సేన 10 వ‌ ఆవిర్భావ స‌భ గ్రాండ్ స‌క్సెస్ తో వైసీపీ శ్రేణుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇన్నాళ్లు ప‌వ‌న్ కళ్యాణ్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ వ‌స్తున్న వైసీపీ నేత‌ల‌కు.. ఈస‌భ విజ‌య‌వంత‌మ‌వ‌డంతో వైసీపీలో అంత‌ర్మ‌ధ‌నం మొద‌లైంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అనుకూల మీడియా, సోష‌ల్ మీడియాలో సినిమా ఆడియో ఫంక్ష‌న్ లా ఉందంటూ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్న‌.. లోలోప‌ల మాత్రం ఫ్యాన్ నేత‌లు ఆందోళ‌నలో ఉన్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గం…

Read Full News

ఉచిత విద్య వైద్యం కోసం జనసేన కట్టుబడి ఉంది: పవన్ కళ్యాణ్

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ఏది జరగకూడదని కోరుకుంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ మచిలీపట్నంలో  న భూతో న భవిష్యతీ రీతిలో జరిగింది. అశేష జన సందోహం మధ్య జనసేనాని అధ్బుతమైన ప్రసంగంతో  ఆకటుకున్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పోషించబోయే పాత్రను సభ వేదికగా పవన్ క్లియర్ కట్ గా తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన రాష్ట్ర రాజకీయ యవనికపై…

Read Full News

ప్రజాపోరాటమే జనసేన ప్రస్థానం : నాదెండ్ల మనోహర్

అమరావతి: ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అభద్రతా భావంతో గడప గడపకు కార్యక్రమంలో స్టిక్కర్లు అంటిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవ చేశారు. డబ్బు సంపాదనకే తప్ప… రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక వైసీపీ నాయకులకు లేదని ఆయన అన్నారు. చెడ్డవాడి చేతిలో చట్టం ఉంటే… చట్టం కూడా చెడిపోతుందని, అదే మంచివాడి చేతిలో ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు తథ్యమని జోస్యం చెప్పారు. అధ్వాన్నంగా…

Read Full News
Optimized by Optimole