కాంగ్రెస్ రథాన్ని గెలుపు తీరాలకు చేర్చి.. ప్రజాసంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టాలన్నదే భట్టి లక్ష్యం..
“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాలను పూర్తి చేసుకున్న అనంతరం విరాటపర్వం.. ఉత్తర గోగ్రహణంలో కౌరవ సేనమీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వర్థామ వంటి హేమాహేమీలను మట్టి కరిపించి.. పాండవ మధ్యముడు జయభేరీ మోగించాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజకీయ పరిస్థితులు తలెత్తాయి. దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి గాండీవధారిగా.. శత్రు నిర్జనుడిగా.. భట్టి విక్రమార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్…